02/03/2024
స్పెషల్ అయోధ్య టూర్ భారత్ గౌరవ్ యాత్ర ద్వారా
పూరీ , – కాశీ అయోధ్య.గయ, ప్రయాగ యాత్ర మీకోసం
ప్రయాణం రైలు లో
ప్రయాణీకుల కోరిక మేరకు మరో భారత్ గౌరవ్ ట్రైన్ ను
మార్చి 23, 2024 న సికిందరాబాద్ నుండి ప్రారంభం చేస్తున్నారు
సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు...
సమాచారాన్ని మరింత మందికి చేరే విధంగా ప్రయత్నించండి.
ప్యాకేజీ వివరాలివే
1. తెలుగు రాష్ట్రాల్లోని టూరిస్టులకు శుభవార్త.
ఐఆర్సీటీసీ టూరిజం సికింద్రాబాద్ . భారత్ గౌరవ యాత్ర పేరుతో స్పెషల్ ట్రైన్ లో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో పూరీ, , గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ కవర్ అవుతాయి.
2. ఇది 8 రాత్రులు, 9 రోజుల టూర్ ప్యాకేజీ.
మార్చి 23 న టూర్ ప్రారంభం అవుతుంది.
ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు సికింద్రాబాద్, కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి , విజయనగరంలో భారత్ గౌరవ్ టూరిస్ట్ గంగా పుష్కర రైలు ఎక్కొచ్చు.
మరి ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి.
భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు
మొదటి రోజు: ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరుతుంది.
కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి విజయనగరంలో పర్యాటకులు ఈ రైలు ఎక్కొచ్చు.
రెండో రోజు మధ్యాహ్నం 12 గంటలకు మాల్తీ పాత్పూర్ చేరుకుంటారు. అక్కడ్నుంచి పర్యాటకుల్ని పూరీ తీసుకెళ్తారు. పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. రాత్రికి పూరీలో బస చేయాలి.
మూడో రోజు మాల్తీ పాత్పూర్కు తిరిగి తీసుకెళ్తారు. అక్కడ రైలు ఎక్కితే నాలుగో రోజు గయ చేరుకుంటారు.
నాలుగవ రోజు : గయలో పిండ ప్రదానం, విష్ణుపాద ఆలయ సందర్శన ఉంటాయి. ఆ తర్వాత అక్కడ్నుంచి వారణాసికి బయల్దేరాలి.
ఐదో రోజు వారణాసి చేరుకుంటారు. సారనాథ్, కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశ్వనాథ కారిడార్, అన్నపూర్మ దేవి ఆలయం సందర్శించుకోవాలి. గంగా హారతి కార్యక్రమంలో పాల్గొనొచ్చు..
ఆరో రోజు అయోధ్య చేరుకున్నాక రామ జన్మభూమి, హనుమాన్ గఢి సందర్సన ఉంటుంది. సాయంత్రం సరయు నది తీరంలో సంధ్యాహారతి కార్యక్రమంలో పాల్గొనాలి. ఆ తర్వాత అయోధ్య నుంచి ప్రయాగ్రాజ్ బయల్దేరాలి.
ఏడో రోజు ప్రయాగ్ రాజ్ చేరుకున్న తర్వాత త్రివేణి సంగమం, హనుమాన్ ఆలయం, శంకర్ విమాన్ మండపం సందర్శించుకోవచ్చు.
ఏడో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఎనిమిదో రోజు పర్యాటకులు స్వస్థలానికి చేర్చు కొంటూ తొమ్మిదవ రోజు ఉదయనానికి సీకింద్రాబాద్ చేరడం తో టూర్ ముగుస్తుంది.
ధరలు చూస్తే భారత్ గౌరవ్ ట్రైన్ స్కీమ్లో భాగంగా భారతీయ రైల్వే సుమారు 33 శాతం తగ్గింపు అందిస్తోంది.
కన్సెషన్ తర్వాతే ప్యాకేజీ ధరలు చూస్తే మూడు కేటగిరీల్లో ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
ఎకానమి(నాన్ A C స్లీపర్) : మనిషికి ధర రూ.15100 /- ( ఒక్కరికి )
స్టాండర్డ్ ప్యాకేజ్ (3rdA C) : మనిషికి రూ.*24000 */- ( ఒక్కరికి)
కంఫర్ట్ (2nd A C): మనిషికి ధర రూ.31435/-( ఒక్కరికి )
ఈ టూరిస్ట్ రైలులో మొత్తం 716 బెర్తులు ఉంటాయి.
అందులో
ఎకానమీ ( స్లీపర్) 460
స్టాండర్డ్ (థర్డ్ ఏసీ) 206
కంఫర్ట్ ( సెకండ్ ఏసీ) 50 బెర్తులు ఉంటాయి.
ఎకానమీ కేటగిరీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్ ఏసీ గదుల్లో బస,
స్టాండర్డ్ కేటగిరీలో థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస
కంఫర్ట్ కేటగిరీలో సెకండ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస,
ప్రయాణికులకు అందరికీ ..
వాహనాల్లో సైట్ సీయింగ్, టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
టిక్కెట్స్ కోసం
ట్రావెల్ ఇండియా
ప్రభుత్వ రైల్వే టూరిజం బుకింగ్ ఏజన్సీ
9848829574
8801393100.