ALMPR

ALMPR historical place alampur... alampur in famous god lord shiva (balabrahma), goddes jogulamba (5th shakti peeta)

శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||జమ్మి చెట్టు మన ప్రాచీన సంప్రదాయంలో ఒక ...
18/10/2018

శ్లో|| శమీ శమయతే పాపం
శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియదర్శినీ ||
జమ్మి చెట్టు మన ప్రాచీన సంప్రదాయంలో ఒక విశిష్టమైన చోటు కలది. దసరా నవరాత్రులలో, నవరాత్రి ఆఖరి రోజు అనగా దసరా పండుగ రోజు, సాయంత్రం పూట జమ్మి (శమీ) చెట్టుకు పూజ చేసి ముగిసిన తరువాత జమ్మి ఆకులను తుంచుకుని వాటిని బంగారంలా భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు. ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్నా ఆధ్మాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పైగా కుబేరుడు ఒకనాడు రఘమహారాజుకి భయపడి జమ్మిచెట్లున్న తావున బంగారాన్ని కురిపించాడనే గాథ ఎలాగూ ప్రచారంలో ఉంది. అలాంటి జమ్మి ఆకులను శుభంగా భావించి, జమ్మి కొట్టేందుకు రాలేకపోయిన పెద్దల చేతిలో ఉంచుతారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలనూ సాధించాలని కోరుకోవడమే. పిల్లల మనసులోని ఈ విజయకాంక్షను గ్రహించిన పెద్దలు, వారి మనోకామన నెరవేరాలని తమ దీవెనలను కూడా జతచేస్తారు.
మీరు కూడా మీ యొక్క జీవితంలో విజయ పథానికీ చేరుకోవాలని కోరుకుంటూ..అందరికి దసరా శుభాకాంక్షలు....

దక్షిణ కాశి గా విరాజిల్లుతున్న అలంపురంలో వేంచేసియున్న  శ్రీ జోగులాంబ సమేత శ్రీబాల బ్రహ్మేశ్వర స్వామీ దసరా శరన్నవరాత్రి ఉ...
09/10/2018

దక్షిణ కాశి గా విరాజిల్లుతున్న అలంపురంలో వేంచేసియున్న శ్రీ జోగులాంబ సమేత శ్రీబాల బ్రహ్మేశ్వర స్వామీ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ సిబ్బంది కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేసారు. ఈ ఉత్సవాలు అక్టోబర్ 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరుగుతాయి...

ముందుగా 10వ తేదీ ఉదయం బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆనతి స్వీకరణ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యవ వచనం రుత్విక వరణం, మహా కలశ స్థాపన, అగ్ని ముఖము... సాయంత్రం అంకురార్పణ ధ్వజ రోహణంతో కార్యక్రమాలతో ప్రారంభ మవుతావుతుంది.

ప్రతి రోజు అమ్మవారికి సహస్ర నామార్చన, చండి హోమం, దర్బారు సేవ... సాయంత్రం దర్బారు సేవలో నవ దుర్గల అలంకారంతో కుమారీ సువాసినులచే పూజలందుకొంటుంది.

15వ తేదీ సోమవారం మూల నక్షత్రంలో ఉదయం10 గంటలు శ్రీ జోగులాంబ సామెత శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామీ వార్ల కల్యాణ మహోత్సవం జరుగుతుంది. అనంతరం సాయంత్రం అమ్మవారి సింహ వాహన సేవ....
17వ తేదీ బుధవారం దుర్గాష్టమి, మహర్నవమి ఉదయం 10 గంటల నుండి అమ్మవారి రథోత్సవం... రాత్రి కాళ రాత్రి పూజ జరుగును....

18వ తేదీ ఉదయం 8 గంటల నుండి మహా పూర్ణాహుతి, సాయంత్రం 4 గంటల నుండి షమీ పూజ, ధ్వజ రోహణం.. అనంతరం తెప్పోత్సవం కార్యక్రమంలో తుంగభద్రా నదిలో తెప్పపై వున్నా సింహాసనం మీద కూర్చుని స్వామి అమ్మవార్లు భక్తులకు కనువిందు చేయనున్నారు...

ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో భక్తులను కటాక్షిస్తుంది... 10వ తేదీ (మొదటి రోజు) శైల పుత్రిగా, 11 వ తేదీ (రెండొవ రోజు) : బ్రహ్మచారిణిగా, 12వ తేదీ (మూడవ రోజు) చంద్ర గంట దేవిగా, 13వ తేదీ (నాలగవ రోజు) కూష్మా0డా దేవిగా, 14వ తేదీ (ఐదవ రోజు) స్కంద మాతగా, 15వ తేదీ (ఆరవ రోజు) కాత్యాయని దేవిగా, 16వ తేదీ (ఏడవ రోజు) కాళ రాత్రిగా, 17వ తేదీ (ఎనిమిదవ రోజు) మహా గౌరిగా, 18వ తేదీ (తొమ్మిదవ రోజు) సిద్ది ధాత్రి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తుంది...

ఇక్కడ జోగులాంబ దేవాలయంతో పాటు కొన్ని ఉపాలయాలు కూడా వున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ యోగ నరసింహ స్వామి దేవాలయం. శ్రీ కంచి కామాక్షి దేవాలయాలలో కూడా పూజలు నిర్వహిస్తారు.. 17వ తేదీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి కళ్యాణోత్సవం, 18న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం పై స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు.. 18వ తేదీ యోగ నరసింహ స్వామి అలయంలో దశమి రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీ యోగా నరసింహ స్వామి ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది.
కంచి కామాక్షమ్మ అమ్మవారి ఆలయంలో ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ప్రతీ రోజు ప్రత్యేక పూజలు, నీరాజన మంత్రం పుష్పాలు మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తారు..

నవ బ్రహ్మ ఆలయాలు కూడా వున్నాయి... ఈ ఆలయాల్లో కూడా విశేష పూజలు నిర్వహిస్తారు....
బాలబ్రహ్మేశ్వర స్వామీ దేవాలయాన్ని ఆనుకుని శ్రీ రేణుక దేవి ఆలయం కూడా ఉంటుంది... పిల్లలు కలగని వాళ్ళు అక్కడకు వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తే పిల్లలు పుడతారని ప్రతీది...

చుట్టూ ప్రక్కల ప్రాంతాన్నీ ఆస్వాదించాలనుకునే వారు పాపనాశనం, సంగమేశ్వర స్వామి దేవాలయాలను కూడా దర్శించుకోవచ్చు... సూర్య నారాయణ స్వామి, అంజనేయ స్వామి దేవాలయాలు, గట్టుపై శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి, సంగమేశ్వర స్వామి దేవాలయంగా అలంపూర్ లోకి అడుగు పెట్టక ముందే గుడి దర్శనమిస్తుంది.. పాపనాశనం దేవాలయం వూరికి కొంచం దూరంలో నెలకొనింది. అక్కడికి వాహన సౌకర్యం కూడా వుంది. కళాకారులకు మంచి నేత్రా నందం... ఎందుకంటే అక్కడి దేవాలయాలు, గోడలపై అద్భుతమైన శిల్ప కళా సౌందర్యం ఉట్టి పడుతూ ఉంటుంది... భక్తులు వీక్షించి తరిస్తారని ఆశిస్తున్నాం.... శ్రీ జోగులాంబ....

సుందర నందనం మన వూరు అలంపూర్... అద్భుతమైన డ్రోన్ కి చిక్కిన అందమైన అలంపూర్ నజారా... మీరు తిలకించండి..
09/10/2018

సుందర నందనం మన వూరు అలంపూర్... అద్భుతమైన డ్రోన్ కి చిక్కిన అందమైన అలంపూర్ నజారా... మీరు తిలకించండి..

అన్ని ఏకాదశుల్లోకి తొలి ఏకాదశి ఉత్తమోత్తమమైంది. మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైంది. స్వామి అలంకార ప్రియుడు కనుక మహావ...
21/07/2018

అన్ని ఏకాదశుల్లోకి తొలి ఏకాదశి ఉత్తమోత్తమమైంది. మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైంది. స్వామి అలంకార ప్రియుడు కనుక మహావిష్ణువుకు జాజిపూలతో అలంకారం చేసి శాంతాకారం భుజగశయనం,పద్మనాభం అంటూ మహావిష్ణువును పూజించే ఈ ఏకాదశే తొలిఏకాదశి.
ఆషాఢమాసాన వచ్చిన ఈ ఏకాదశికి ప్రత్యేకత ఉంది ఈ రోజు క్షీరాబ్దిలో మహావిష్ణువు శయనిస్తాడు కనుక ఈ ఏకాదశిని శయనైకాదశి అని అంటారు. స్వామి యోగనిద్రకు ఉపక్రమిస్తాడనే జనులందరూ జనార్దనుని కోసం కటికోపాసం చేస్తారు. కనుక నిర్జలైకాదశిని అనీ,హరి దగ్గరే వాసం చేస్తారు కనుక హరివాసరం అని శయనై కాదశిని వ్యవహరిస్తారు. ఉత్తరదిశగా ఉన్న సూర్యుడు నేటినుంచి దక్షిణం వైపుకు వాలినట్లుగా కనిపిస్తాడు. కనుక ప్రత్యక్షనారాయణునిగా తలిచే సూర్యుడు నేటినుంచి పడుకున్నట్లుగా భావించి ఈ ఏకాదశి శయనైకాదశిని పిలవడానికి కారణంగా చెప్తారు.శయనైకాదశి ఉపవాసవివరాలను భవిష్యోత్తర పురాణం చెబుతుంది.ఏకాదశీవ్రత ప్రాధాన్యం ఏమిటో బ్రహ్మవైవర్తన పురాణం చెప్తుంది.ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్న దానానికి అనంతకోటి పుణ్య ఫలాలు వస్తాయని చెప్తారు.శ్రీకృష్ణావతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుని తలుచుకుని అత్యంత అను రాగంతో కూడిన భక్తితో మహావిష్ణువును శోభాయమానంగా అలంకరించి పదకొండు వత్తులతో దీపారాధన చేస్తారు. హరికథలనే చెప్పుకుంటూ హరితో నివాసం చేస్తూ ఉపవాసం చేసిన శ్రీహరికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. ప్రతి వైష్ణవాలయంలోను స్వామికి పవళింపుసేవోత్సవం జరుపుతారు.గోముఖభాగమందు వేదాలు,కొమ్మలందు హరిహరులు, నేత్రాలలో సూర్యచంద్రులు, జిహ్వనందు సరస్వతి, పూర్వభాగములో యముడు, పశ్చిమంలో అగ్ని, గోమయంలో లక్ష్మి,అరుపులో ప్రజాపతి ఇలా గోదేహమంతా సర్వదేవతలు సర్వతీర్థాలు సర్వదేవతా నివాసస్థానమైన గోవు ను కూడా ఈ ఏకాదశిన పూజిస్తారు.అధర్వణవేదం, బ్రహ్మాండ,పద్మపురాణం, మహాభారతం కూడా గోవిశిష్టత తెలుపుతాయ.గోశాలలను శుభ్రం చేసి ముత్యాల ముగ్గులుతీర్చి మధ్యలో ముప్పైమూడు పద్మాల ముగ్గులువేసి శ్రీమహాలక్ష్మీసమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమను ఆ పద్మాలపై పెట్టి శాస్త్రోకంగా పూజచేస్తారు. పద్మానికొకఅప్పడం చొప్పున వాయనాలు దక్షిణతాంబూలాలనిస్తారు. మహావిష్ణువు అత్యంత ప్రేమపాత్రమైన తులసమ్మ దగ్గర పద్మం ముగ్గువేసి దీపం వెలిగించి వివిధరకాల పండ్లను నివేదిస్తారు.ఏకాదశి వ్రతాన్ని రుక్మాంగదుడు,అంబరీషుడు కూడా పాటించారు.వాళ్లు పాటించడమే కాక వారి రాజ్యాల్లోని జనులందరి చేతకూడా ఏకాదశివ్రతాన్ని పాటించేలా చేశారు. ఏకాదశీవ్రతం చేసేవారి యెడ సదా మహావిష్ణువు తోడునీడగా ఉంటాడు.సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశీ వత్రం చేసి భగవానుని అనుగ్రహం పొందిందని పండరిపురంలో తొలేకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు.
బంధుమిత్రులందరు కలసి సాయంత్రపుపూట సామూహిక విష్ణుసహస్రనామావళిని పఠిస్తారు.హరిభజన చేస్తారు. చాతుర్మాస వ్రతానికి ఆరంభం ఈరోజు.దీనిని గురించి బ్రహ్మవైవర్తన పురాణం వివరిస్తుంది.ఈ రోజున పిప్పల వృక్షాన్ని ప్రదక్షణ చేయడం కూడా మంచిదని అంటారు. చాతుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు నిమ్మపండ్లు, అలసందెలు,ముల్లంగి, గుమ్మడికాయ,చెరకుగడలు వర్జించాలని అంటారు. మహావిష్ణువు నాలుగు నెలలపాటు క్షీర సముద్రంలో శేషశాయపైన పవళిస్తాడని యతులు సన్యాసులు మహావిష్ణువును కీర్తించడంలో తమ జీవితకాలాన్ని వెచ్చిస్తుంటారు.దేశ సంచారులైన యతులు ఈ నాలుగునెలలూ ఒక్కచోటనే ఉండి విష్ణుకీర్తనలు చాతుర్మాస వ్రతాన్ని చేస్తుంటారు. బౌద్ధుల్లోను చాతుర్మాస వ్రతమున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయదారుల పండుగగా భావిస్తారు.కొత్త పాలేర్లను పనికి పెట్టుకుంటారు.పాలేర్లందరికీ కొత్తబట్టలిచ్చి వారిని గౌరవిస్తారు.

తొలి ఏకాదశి నాడు పేలాల పిండి తినడంలో అంతరార్ధం ఏమిటి?

ఆషాడ శుద్ద ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు.

దీనినే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు.

ఈ నాలుగు నెలలు శ్రీమన్నారాయణుడు శయనిస్తారని అందువలన లోక కళ్యాణార్ధము ఋషులు,స్వామీజీలు చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారని చెప్తారు.

ఈ రోజున అన్ని దేవాలయములలో పేలాల పిండిని ప్రసాదంగా ఇస్తారు.

పేలాలలో బెల్లపు పొడి మరియు యాలకుల పొడిని వేసి దంచి ఈ పేలాల పొడిని తయారు చేస్తారు.

గ్రీష్మ ఋతువు నుండి వర్ష ఋతువుకు మారుతున్న సమయం కనుక సహజంగా ఏర్పడే శారీరక ఋగ్మతలను ఈ పేలాల పిండి తీసుకొనటం వలన మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

ఈ రోజు పేలాల పిండిని మన పితృ దేవతలను స్మరించుకుంటూ తీసుకొనడం వలన వారు సంతుష్టులై మనని కాపాడుతారని పెద్దలు చెప్తారు.

శ్రీ గర్భ రక్షాంబికా స్తోత్రం..గర్భరక్షాంబికా అంటే గర్భములో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలగన్న యమ్మ...
04/06/2018

శ్రీ గర్భ రక్షాంబికా స్తోత్రం..

గర్భరక్షాంబికా అంటే గర్భములో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలగన్న యమ్మ చాల పెద్దమ్మ. పార్వతీ మాతయే గర్భారక్షాంబికా అమ్మగా పిలవబడుతోంది. అమ్మ వారు కేవలం గర్భం దాల్చిన వారికే కాకుండా, సంతానము లేని దంపతులకు కూడా సత్సంతానము కటాక్షిస్తుంది.

పూర్వం ఇక్కడ నిధ్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మ పత్ని వేదిక తో కలిసి ఒక ఆశ్రమం లో నివసించేవారు. వాళ్ళు ఎప్పుడూ ఈశ్వరుని పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ఆ దంపతులు ఇద్దరు ఆనందంగా కాలం గడిపేవారు. అయితే వారికి ఉన్న ఒకే సమస్య సంతానము కలుగక పోవడం. సంతానము కొఱకై ఈ దంపతులు అమ్మ వారిని, తండ్రి శంకరుడిని విశేష ఆరాధన చేశారు. ఒక మంచి రోజు ఆ తల్లి గర్భం దాల్చింది. ఇలా గర్భం దాల్చిన తర్వాత, ఒక రోజు నిధ్రువ మహర్షి వరుణుడిని కలుసుకోవడానికి బయటకి వెళతారు. అప్పుడు వేదిక మూడవ త్రైమాసికం లో ఉన్నది, కొద్ది రోజులలో ప్రసవం జరగాల్సి ఉంది.

నిధ్రువ మహర్షి బయటకి వెళ్ళిన సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమమునకు వచ్చారు. అప్పటికే ఇంటి పనులలో అలసిపోయిన వేదిక విశ్రాంతి తీసుకుంటోంది, దాంతో వచ్చిన మహర్షికి అతిథి మర్యాదలు చేయలేదు, ఆయన వచ్చారని తెలియదు. ఆగ్రహం చెందిన ఊర్ధ్వ పాదుడు, ఆమె గర్భం ధరించి ఉంది అని తెలియక ఆమెను శపిస్తారు. ఆయన శాప ఫలితంగా వేదిక ఒక వింత వ్యాధితో బాధపడడం మొదలు అవుతుంది. తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా, గర్భంలో ఉన్న శిశువు కూడా తినివేయబడడం మొదలు అయ్యింది. వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధ పడుతూ సర్వ మంగళ స్వరూపమైన ఆ పార్వతీ మాతను ప్రార్ధిస్తుంది.

అవ్యాజకరుణామూర్తి అయిన అమ్మవారు వెంటనే ప్రత్యక్షం అయ్యి ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది. ఈ విధం గా రక్షింపబడిన శిశువు ఆ కుండలో పెరిగి చక్కని మగ పిల్లవాడు పుడతాడు. వాడికి నైధ్రువన్ అని పేరు పెడతారు. అప్పుడే పుటిన ఈ శిశువు కి కామధేనువు తన పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిధ్రువ మహర్షి విషయం తెలుసుకుని ఎంతో సంతోషించి శివ పార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మిమ్మల్ని ఆశ్రయించే వాళ్లకి గర్భ రక్ష కలుగజేయమని ప్రార్ధిస్తారు.

శౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం:

ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీమాత్రే నమః
ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్
ప్రజా కర్తా, ప్రజా పతే
ప్రగృహ్షీణివ బలిం చ ఇమం
ఆపత్యాం రక్ష గర్భిణీమ్. II 1 II

అశ్వినీ దేవ దేవేసౌ
ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం
సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం
చ రక్షతాం పూజ యనయా II 2 II

రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా
ప్రగృహనంతు బలిం ద్విమం
యుష్మాకం ప్రీతయే వృతం
నిత్యం రక్షతు గర్భిణీమ్. II 3 II

ఆదిత్య ద్వాదశ ప్రోక్తా
ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం
యుష్మాగం తేజసాం వృధ్య
నిత్యం రక్షత గర్భిణీమ్. II 4 II

వినాయక గణాధ్యక్షా
శివ పుత్రా మహా బల
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 5 II

స్కంద షణ్ముఖ దేవేశా
పుత్ర ప్రీతి వివర్ధన
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 6 II

ప్రభాస, ప్రభవశ్శ్యామా
ప్రత్యూషో మరుత నల
దృవూ ధురా ధురశ్చైవ
వసవోష్టౌ ప్రకీర్తితా
ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం
నిత్యం రక్ష గర్భిణీమ్. II 7 II

పితుర్ దేవీ పితుశ్రేష్టే
బహు పుత్రీ మహా బలే
భూత శ్రేష్టే, నిశావాసే
నిర్వృతే, శౌనక ప్రియే
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 8 II

రక్ష రక్ష మహాదేవ,
భక్తానుగ్రహకారక
పక్షి వాహన గోవిందా
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 9 II

పై స్తోత్రమును ప్రతీ రోజూ పూజా మందిరంలో, అమ్మ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి, ఈ గర్భరక్షా స్తోత్రం చదువుకోవాలి. పిల్లలు లేని వారికి గర్భం దాల్చడం జరుగుతుంది. గర్భం దాల్చిన వాళ్లకి చక్కని ప్రసవం అవుతుంది.ఎప్పుడూ ఎవరికీ గర్భస్రావం కావడం, పిల్లలు కలుగక పోవడం అనే సమస్య లేదు...

హనుమజ్జయంతి 10/05/2018వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం నాడు వైధృతి యోగం కర్కాటక లగ్నమునందు శనివారం మధ్యాహ్నకాలమున కౌ...
09/05/2018

హనుమజ్జయంతి 10/05/2018
వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం నాడు వైధృతి యోగం కర్కాటక లగ్నమునందు శనివారం మధ్యాహ్నకాలమున కౌండిన్య గోత్రమున ఆంజనేయావతారం జరిగినది.
"ఆంజనేయః పూజిస్తశ్చేత్ పూజితాస్సర్వ దేవతాః"
ఆంజనేయుని పూజిస్తే సకల దేవతలనూ పూజించినట్లేనని శాస్త్రోక్తి. ఆంజనేయస్వామి ఆరాధన సర్వ గ్రహదోషాలను తొలగించి అభీష్టసిద్ధిని కలుగజేస్తుంది.
ఈ రోజున హనుమంతుని అర్చించిన వారికి సర్వకామనలు తీరుతాయి.

హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది. భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, నైమిక్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు. నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.

రెండవది తత్తుల్యమైన రోజు ఒకటున్నది. అది హనుమద్వ్రతం అని చేస్తారు. ఇది వైశాఖ బహుళ దశమి మధ్యాహ్నం స్వామియొక్క ఆవిర్భావం కనుక హనుమజ్జయంతి. హనుమద్వ్రతము మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేస్తారు. దీనికి కూడా కల్పమేదైనా ఉందా? కల్పం ఉంటే అది వైదికము అని గుర్తు. ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగిన దానిని కల్పము అంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారనుకోండి కల్పోక్త ప్రకారేణ అంటారు. అంటే కల్పము ఎలా చెప్పిందో అలా చేయాలి. దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారు. అంటే అది ఖచ్చితంగా మీకు ఫలితాన్నిచ్చేస్తుంది. హనుమద్వ్రతమునకు కల్పము ఉన్నది.
జై శ్రీరాం🚩

5వ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్ క్షేత్రంలో    శ్రీ బాలా బ్రహ్మేశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవ...
16/02/2018

5వ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్ క్షేత్రంలో శ్రీ బాలా బ్రహ్మేశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నారు... ఈ సందర్బంగా 4వ రోజు స్వామీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు... ఉదయం దేవతల భావి జలాలతో అభిషేకోత్సవం... హోమాలు... యాగాలు.... శ్రీ యంత్రం.. గణేశ యంత్రం... నవగ్రహ యంత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.... మీరు కూడ వీక్షించండి.. తరించండి...

13/02/2018

alampur temple related song

26/01/2018

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

వసంతి పంచమి సందర్భంగా శ్రీ జోగులాంబ అమ్మవారికి సహస్ర గఠాభిషేకం నిర్వహించడం జరిగింది... భక్తులు  అమ్మవారిని నిజరూప దర్శనం...
22/01/2018

వసంతి పంచమి సందర్భంగా శ్రీ జోగులాంబ అమ్మవారికి సహస్ర గఠాభిషేకం నిర్వహించడం జరిగింది... భక్తులు అమ్మవారిని నిజరూప దర్శనం చేసుకున్నారు... మీరు కూడా అమ్మవారిని దర్శించి తరించండి....

Address

Temple Street
Alampur

Website

Alerts

Be the first to know and let us send you an email when ALMPR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share