మన దేవాలయాలు మన వైభవం

మన దేవాలయాలు మన వైభవం మన దేవాలయాలు మన వైభవం పేజి Mana Temples వారిది..మన దేవాలయాలను అందరికీ తెలియచేయాలి అన్నది మా ఉద్యేశ్యం

అయోధ్య బాల రామయ్యా ప్రతిష్ఠ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఎవరు రాసారో తెలియదు కానీ  అత్యద్భుతంగా ఉందిఇంగ్లీషు వాడు వచ్చాక రా...
22/01/2025

అయోధ్య బాల రామయ్యా ప్రతిష్ఠ
వార్షికోత్సవ
శుభాకాంక్షలు

ఎవరు రాసారో తెలియదు కానీ అత్యద్భుతంగా ఉంది

ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు .

మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన - ఆదర్శ పురుషుడు

మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన - అద్దం - రాముడు .

ధర్మం పోత పోస్తే రాముడు
ఆదర్శాలు రూపుకడితే రాముడు .
అందం పోగుపోస్తే రాముడు
ఆనందం నడిస్తే రాముడు

వేదోపనిషత్తులకు అర్థం రాముడు
మంత్రమూర్తి రాముడు .
పరబ్రహ్మం రాముడు .
లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు

ఎప్పటి త్రేతా యుగ రాముడు ?
ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ?
అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే

చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -

శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.

బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన
పాట -
రామాలాలీ - మేఘశ్యామా లాలీ

మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష.

మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా

వినకూడని మాట వింటే అనాల్సిన మాట -
రామ రామ

భరించలేని కష్టానికి పర్యాయపదం -
రాముడి కష్టం .

తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు

కష్టం గట్టెక్కే తారక మంత్రం
శ్రీరామ .

విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ .

అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా

వయసుడిగిన వేళ అనాల్సిన మాట -
కృష్ణా రామా !

తిరుగులేని మాటకు - రామబాణం

సకల సుఖశాంతులకు - రామరాజ్యం .

ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన

ఆజానుబాహుడి పోలికకు - రాముడు

అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు

రాముడు ఎప్పుడూ మంచి బాలుడే .

చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా -
Rama killed Ravana ;

Ravana was Killed by Rama .

ఆదర్శ దాంపత్యానికి సీతారాములు

గొప్ప కొడుకు - రాముడు

అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు

గొప్ప విద్యార్ధి రాముడు
(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .

మంచి మిత్రుడు- రాముడు
(గుహుడు చెప్పాడు).

మంచి స్వామి రాముడు
(హనుమ చెప్పారు).

సంగీత సారం రాముడు
(రామదాసు , త్యాగయ్య చెప్పారు) నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం
(పిబరే రామరసం)
సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)

కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు జన్మ తరించడానికి - రాముడు , రాముడు, రాముడు .

రామాయణం పలుకుబళ్లు

మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది .

తెలుగులో కూడా అంతే .

ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని
అడిగినట్లే ఉంటుంది ...

చెప్పడానికి వీలుకాకపోతే -
అబ్బో అదొక రామాయణం .

జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే
సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .

ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే -
అదొక పుష్పకవిమానం

కబళించే చేతులు , చేష్టలు
కబంధ హస్తాలు .

వికారంగా ఉంటే -
శూర్పణఖ

చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).

పెద్ద పెద్ద అడుగులు వేస్తే -
అంగదుడి అంగలు.

మెలకువలేని నిద్ర
కుంభకర్ణ నిద్ర

పెద్ద ఇల్లు
లంకంత ఇల్లు .

ఎంగిలిచేసి పెడితే -
శబరి

ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు

అల్లరి మూకలకు నిలయం
కిష్కింధ కాండ

విషమ పరీక్షలన్నీ మనకు రోజూ -
అగ్ని పరీక్షలే .

పితూరీలు చెప్పేవారందరూ -
మంథరలే.

సాయం చేసినపుడు- ఉడుత భక్తి..
కార్యాన్ని సాధించినపుడు -హనుమ యుక్తి..
గొడవ కు దిగే వాళ్ళ పేరు - లంకిని

యుద్ధమంటే రామరావణ యుద్ధమే .

ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -
(రావణ కాష్టాలే .)

కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది
(ఇది విచిత్రమయిన ప్రయోగం ).

సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు . బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు

ఒంటిమిట్టది ఒక కథ ..
భద్రాద్రిది ఒక కథ
అసలు రామాయణమే మన కథ .
అది రాస్తే రామాయణం
చెబితే మహా భారతం

అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు హిందుయిజమ్ ఒక మతం కాదు
అది ఒక జీవన విధానం

అందుకే ఇప్పటి South Asian దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాలో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు

రామాయణకథలు మనకంటే చక్కగా Muslim majority దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు

జై శ్రీ రామ్.....

|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది

జై శ్రీరామ్

మీ శ్రేయోభిలాషి
గిరీష్

 #పూరీజగన్నాథస్వామి #మనదేవాలయాలు_మనసంపద #ప్రతిఒక్కరు_తప్పకుండా_షేర్_చేయండిభక్తులను రక్షించడానికిదుష్టులును శిక్షించడానిక...
21/01/2025

#పూరీజగన్నాథస్వామి
#మనదేవాలయాలు_మనసంపద
#ప్రతిఒక్కరు_తప్పకుండా_షేర్_చేయండి

భక్తులను రక్షించడానికి
దుష్టులును శిక్షించడానికి
వస్తున్నాయ్ వస్తున్నాయి
జగన్నాథ రథ చక్రాలు!!
మనలో అహం పారద్రోలాడానికి
ప్రేమాభిమానాలు పెంచడానికి
వస్తున్నాయ్ వస్తున్నాయి
జగన్నాథ రథ చక్రాలు!!
ఈర్ష్య, అసూయ పొగట్టడనికి
భక్తి భావన పెంచడానికి
వస్తున్నాయ్ వస్తున్నాయి
జగన్నాథ రథ చక్రాలు!!
మనలో మంచితనం పెంచడానికి
విష భావాలు తొలిగించడానికి
వస్తున్నాయ్ వస్తున్నాయి
జగన్నాథ రథ చక్రాలు!!

ప్రతి సంవత్సరం అలా సాగె పూరియాత్ర జీవితంలో ఒకసారి అయిన చూడాలి..జగన్నాథ రథ చక్రాలు లాగాలి ..మనలో పెరుకొని పోయిన అసహనం,ఈర్ష్య, దుఃఖం,భయంపోగొట్టుకోవాలి..ప్రేమ,సహనం,భక్తి,సహాయ గుణాలు పెంచుకోవాలి...అలా మనను చేయగలిగే వాడే జగన్నాథుడు!!

భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం,విశిష్టత,అద్భుతం కలిగిన దేవాలయాలు ఎన్నో వున్నాయి. అలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాల్సిన క్షేత్రం.అలంటి మహా అద్భుత ఆలయాలలో ఎంతో ప్రసిద్ధిచెందిన పూరీ జగన్నాథ్ ఆలయం.

ఈశాన్య భారతదేశంలోని ఒడిషాలోని ఈ పూరీజగన్నాథ్ ఆలయం వుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం చేసే రథయాత్ర ఎంతో ప్రఖ్యాతమైనది.ప్రపంచ ప్రసిద్ధిచెందింది.ఈ ఆలయాన్ని 1078సంలో పూరీలో నిర్మించారు.

ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించే గోడలు, స్థంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీస్కోస్తాయి.అన్ని ఆలయాలలో వున్నట్లే గోపురం, దేవతలు, గంటలు, ప్రసాదం అన్నీ వున్నా ప్రతీదానికీ ఒక విశిష్టత వుంది ఇక్కడ.ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ ఆలయానికున్నాయి.

గోపురం
-----------
ప్రతి ఆలయంలో గోపురం నీడని మనం చూడొచ్చు గానీ ఈ పూరీ జగన్నాథ ఆలయంలో గోపురం నీడ కన్పించదు. పగలైనా రాత్రైనా అస్సలు కన్పించదు. ఇది దేవుడి కోరిక అంటారు కొందరు. ఆలయ గొప్పదనమని మరికొందరు అంటారు.

రెపరెపలాడే జెండా
-----------------------
ఈ ఆలయగోపురానికి పైనకట్టిన జెండాకి ఒక ప్రత్యేకతవుంది.అన్ని జెండాలలో గాలి ఎటువైపు వస్తే అటు వైపు ఎగురుతుంటాయి.కానీ ఇక్కడ గాలికి వ్యతిరేకదిశలో రెపరెపలాడుతుంటుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఆ జెండాను తరచుగా ఆలయప్రత్యేక పూజారులు మారుస్తుంటారు. ఒక వేళ మార్చడం మరిచిపోతే ఆలయాన్ని దాదాపు 18సంలు మూసివేయాలని భావిస్తారు.

పూరీ జగన్నాధుడి రధయాత్ర
--------------------------------------
ఈ ఆలయ ప్రత్యేకతలో రధయాత్ర ఎంతో ముఖ్యమైనది.ఈ రధయాత్రలో కూడా కొన్ని ప్రత్యేకతలు వున్నాయి.రధయాత్రకు ముందు పూరీ రాజు బంగారు చీపురుతో రథాల ముందు వూడ్చి తాళ్ళను లాగటంతో రధయాత్ర ప్రారంభమౌతుంది.
పూరీ వీధుల్లో శ్రీకృష్ణ, బలరాముల విగ్రహాలను వూరేగిస్తారు.రధం సుమారు 45అడుగుల ఎత్తు, 35అడుగులు వెడల్పు వుంటుంది. ఈ రధానికి సుమారు 16 చక్రాలుంటాయి. పూరీ జగన్నాధ రెండు రధాలు లాగుతారు.

మొదటి రధం దేవుళ్ళను రధం వరకు తీసుకెళుతుంది.ఆ తరవాత 3 చెక్క పడవళ్ళలో దేవతలు నది దాటాలి.అక్కడి నుంచి మరో రధం దేవుళ్ళను గుండీచ ఆలయానికి తీసుకెళుతుంది.
ప్రతీ ఏడాది జరిగే ఈ రధయాత్రలో ఒక విశిష్టత జరుగుతుంది. గుండీచ ఆలయానికి వూరేగింపు చేరుకోగానే రథం దానంతట అదే ఆగిపోతుంది.ఇది ఆలయంలో ఒక విశిష్టత. సాయంత్రం 6 గంటల తర్వాత ఆలయతలుపులు మూసేస్తారు.పూరీలో అత్యంత ప్రసిద్ధిచెందిన జగన్నాధ ఆలయం చాలా ఎత్తైనదిమీరు పూరీలో ఎక్కడ నిలబడినా గోపురంవైపున్న సుదర్శన చక్రాన్ని చూసినా అది మీ వైపు తిరిగినట్టుమిమ్మల్ని చూస్తున్నట్టు కనిపించటం ఇక్కడి ప్రత్యేకత.

సైన్స్ కి అంతుపట్టని రహస్యాలు
------------------------------------------
సాధారణంగా తీర ప్రాంతాలలో గాలి సముద్రపు వైపు నుంచి భూమి వైపుకి వుంటుంది.సాయంత్రపు పూట గాలి నేలవైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది.కానీ పూరీలో అంతా విభిన్నం.సముద్ర అలల శబ్దం ఇంకొక అద్భుతం . దేవుడి గుడి సింహ ద్వారం గుండా ఆలయం లోకి ప్రవేశిస్తూ ఒక్క అడుగు లోపలకి పెట్టగానే సముద్రపు అలలు అస్సలు వినిపించవు ..కానీ ఎప్పుడైతే గుడి బయటకి అడుగు పెడతామో వెంటనే చాలా క్లియర్ గా సముద్రం అలల శబ్దం వినిపిస్తుంది ..అయితే సాయంత్రం అయితే ఈ శబ్దాన్ని గమనించలేరు ..కారణం ఇద్దరి దేవుళ్ళ సోదరి సుభద్రాదేవి ఆలయం లోపల ప్రశాంతత కోరటం వలన ఇలా జరుగుతుంది అని ఆలయ పూజారులు చెప్తారు ..

మహా ప్రసాదం
-------------------
ఇక జగన్నాధ్ ఆలయం లో దేవుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని “మహా ప్రసాదం ” గా పిలుస్తారు దాదాపు రోజుకి 56 రకాల పిండివంటలని …దేవుడి కి నైవేద్యం గా పెడతారు ఈ ప్రసాదాన్ని ఎవరు కూడా వృధా చెయ్యరు ….ఇంకా ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకు వెళ్లి తమ బందు మిత్రులకి పంచి పెడతారు కూడా…

సహజసిద్ధమైన తయారీ
---------------------------------

ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ ప్రసాదాల్ని కేవలం కుండలలో నే తయారు చేయడం …ఎలాంటి ఇత్తడి గాని, ఇనుము కానీ మారె ఇతర లోహ పాత్రలని ఉపయోగించక పోవడం.

కృష్ణుడిని, బలరాముడిని అంతమొందించడానికి, కృష్ణుడి మామ అయిన కంసుడు వారిద్ధరిని మథురకి ఆహ్వానిస్తాడు.అందుకుఅకురుడికిరధాన్ని ఇచ్చి కృష్ణ-బలరాములను మధురకు కంసుడుతీసుకునిరమ్మంటాడు.శ్రీ కృష్ణ పరమాత్ముడు, బలరాముడు గోకులం నుంచి మథురాకి రధము పై బయలుదేరిన రోజుని పురస్కరించుకుని, జగన్నాథ రథ యాత్రను వేల సంవత్సరాలుగాజరుపుకుంటూ వస్తున్నారు.
పూరి లో వైభవంగా సాగే జగన్నాథ రథ యాత్రలో పాలుపంచుకోవడానికి దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ప్రతి ఏట జరిగే ఈ రథ యాత్రరెండురోజుల పండుగగా ఉంటుంది. మొదటి రోజున, జగన్నాథస్వామివారిని, వారికుటుంబ సమేతంగా, జగన్నాథ స్వామి అలయంనుంచి మొదటిరధం లో అంగరంగ వైభవంగా నది వరకు తిసుకువేళతారు.అక్కడనుంచిప్రతిమలనుఒక పడవలో నది దాటించి,నదికి ఆవల ఉన్న మౌసి అమ్మవారి ఆలయం వద్దకు తీసుకువెళ్తారు. మరుసటిరోజు, మౌసి అమ్మవారి ఆలయం నుంచి ఆ ప్రతిమలను నదికివద్దకు తీసుకువచ్చి,ఒక పడవపై వాటినిఇటు వైపు ఒడ్డుకి తరలిస్తారు. అక్కడేసిద్ధంగాఉండేరెండో రధం పై ఊరేగిస్తూ మేళ తాళల, భక్తుల కేరింతల మధ్య మరల జగన్నాథ స్వామి ఆలయానికి చేరుకుంటారు.

ఎలా వెళ్ళాలి
------------------
1. ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం వుంది.
2. భువనేశ్వర్‌లోని బిజూపట్నాయక్‌ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో వుంది.
3. దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి.
4. కోల్‌కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్‌ రైల్వేస్టేషన్‌ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో వుంది.
5. భువనేశ్వర్‌, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది

మీ శ్రేయోభిలాషి
గిరీష్

 #మనదేవాలయాలు_మనసంపద #మనదేవాలయాలు #దయాచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండిరంగనాథ స్వామి దేవాలయం, శివనసముద్ర కు సమీపంలో-----...
23/12/2024

#మనదేవాలయాలు_మనసంపద
#మనదేవాలయాలు
#దయాచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి

రంగనాథ స్వామి దేవాలయం, శివనసముద్ర కు సమీపంలో
---------------------------------------------------
దక్షిణ భారతదేశంలో అనేక రంగనాథ దేవాలయాలు కొలువై ఉన్నాయి మరియు వాటిలో చాలా వరకు కావేరి నది ఒడ్డున ఉన్నాయి. కావేరి నదిపై మూడు వేర్వేరు ద్వీపాలలో నిర్మించిన అటువంటి మూడు ప్రధాన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి, మిగిలినవి శ్రీరంగపట్నం మరియు శ్రీరంగం వద్ద ఉన్నాయి.
కర్ణాటకలోని చమరాజనగర్ జిల్లాలోని శివనసముద్ర కొల్లెగల్ లోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం యెంతో పురాతనమైన మరియు యెంతో విసిస్టత కలిగిన దేవాలయం. మైసూర్ కి 85 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంది . ఇక్కడ ఉన్న రంగనాథ స్వామి దేవాలయాన్ని ద్రావిడ శైలి లో నిర్మించారు .
ఇక్కడ కొలువైన శ్రీ రంగనాథస్వామిని "మధ్య రంగ" అని కూడా పిలుస్తారు .రంగనాథుని యొక్క మూడు రూపాలలో, ఇక్కడి కొలువైన స్వామి యవ్వన రూపానికి ప్రాతినిధ్యం వహిస్తుందని నమ్ముతారు, అందువల్ల దీనిని 'మోహనా రంగా' మరియు 'జగన్మోహన రంగా' అని కూడా పిలుస్తారు.
దేవాలయాన్ని అభిరుద్ది చేస్తే యెంతో చరిత్రాత్మక ప్రదేశం అవుతుంది .ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం ఇది .

ప్రతి నిత్యం దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక సమాచారం కోసం మన దేవాలయ లు గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

మి శ్రేయోభిలాషి
గిరీష్

18/08/2024

భగవత్ బంధువులందరికీ రాఖీ పౌర్ణమి/జంధ్యాల పౌర్ణమి/హయగ్రీవ జయంతి /విఖసన జయంతి శుభాకాంక్షలు

భగవత్ బంధువులందరికీనాగుల పంచమి/గరుడ పంచమిశుభాకాంక్షలులక్ష్మణ స్వామి ఆదిశేషుని రూపం లో దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం....షోడ...
09/08/2024

భగవత్ బంధువులందరికీ
నాగుల పంచమి/గరుడ పంచమి
శుభాకాంక్షలు

లక్ష్మణ స్వామి ఆదిశేషుని రూపం లో దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం....

షోడశ బహు అష్ట ముఖ ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం,కోట్ల నర్సింహలు పల్లె గ్రామం ,గంగాధర్ మండలం,
కరీంనగర్ జిల్లా

ప్రతి నెల పౌర్ణమి తిథి అర్ధరాత్రి నాడు నాగ దేవత స్వామి వారిని దర్శించుకుంటుంది ఆట.శని గ్రహ,కుజ దోష నివారణకు,వివాహాల కోసం,సంతానం కొరకు విశేషమైన పూజలు నిర్వహించబడును.

చైత్ర పౌర్ణమి నుండి 3 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం.

ఏలా వెళ్ళాలి : కరీంనగర్ నుండి సుమారు 30 కి మీ దూరం లో ఉంటుంది

Srikanth Chennamadhavuni  గారి పోస్ట్"శ్రావణమాసం శ్రీమహాలక్ష్మి" కి ప్రీతిపాత్రమైనది."తన భర్త శ్రీమహావిష్ణువు నక్షత్రం శ...
05/08/2024

Srikanth Chennamadhavuni గారి పోస్ట్

"శ్రావణమాసం శ్రీమహాలక్ష్మి" కి ప్రీతిపాత్రమైనది."తన భర్త శ్రీమహావిష్ణువు నక్షత్రం శ్రవణం" కావున ఈ నెల తనకు
ఎంతో ఇష్టమైనది.

పరమపద "శ్రీ" ని(శ్రీ,భూ,నీళా దేవి "శ్రీ" యొక్క మూడు
మూల తత్త్వములు) శ్రీమన్నారాయణుడితో" పాటు కొలిస్తే అమ్మవారు శీఘ్రముగా అనుగ్రహిస్తారు. పుట్టింటికి పిలిచినప్పుడు తనతో పాటు,తన భర్తను కూడా పిలిచి, ఆత్మీయ సత్కారాలు చేస్తే భార్య ఎలా ఉప్పొంగిపోతుందో శ్రీమహాలక్ష్మి కూడా అంతే.తన భర్తను కూడా తోడుగా కొలిస్తే అంతే సంతోషం.అంతే వేగంగా తన కన్న బిడ్డలపై కరుణామృతమును కురిపిస్తుంది.

అయితే అమ్మవారిని కొలిచేవారు అమ్మను తత్త్వత: తెలుసుకొనటం కోసం...

లక్ష్యమును చేర్చినది, చేర్చబోవునది,అత్యున్నత స్థానమునకు ఆధారమైనది కావున "మహాలక్ష్మి",

మహనీయులకు శరణాగత స్థానమైనందున(మహత్) "మహాశ్రీ",

అంతుచిక్కక పోవటం వలన "మాయ",ఆ అంతుచిక్కని వాటిలో గొప్పనైనది,సర్వ వ్యాపి కావున "మహామాయ",

భగము(జ్ఞాన,శక్తి,ఐశ్వర్య,బల,వీర్య,తేజము)ను కలిగి యున్నందున,భగవాన్ సతీమణి అయినందున "భగవతి",

సర్వజీవులను మోహింపజేయునది కావున "మోహిని",

చేరుటకు దుర్గమమైనది(కష్టమైనది),భక్తులను రక్షించేది కావున "దుర్గా",

భగవంతునితో సంధానించునది కావున "యోగా",జీవులకు జ్ఞానమును ప్రసరింపజేయును కావున "మహాయోగా",

చండుని భార్య అయినందున "చండీ",ఉగ్రరూపం దాల్చటం వలన "చండికా",

భద్రమును,సుఖ సంతోషములను కలుగజేయునది కావున "భద్రా",

మంచిని పెంచి,చెడును నాశనం చేయును కావున "కాళి",

పై విధముగా శిష్టులను,దుష్టులను నియంత్రించునది(శిష్ట రక్షణ,దుష్ట శిక్షణ ద్వారా) కావున "భద్రకాళి",

అనంతముగా వ్యాపించియున్నది కావున "వ్యోమ",

అంతటా నిండియున్నది కావున "పురీ",

భగవంతుడైన పరావరుని ప్రతినిధిత్వం వలన "పరావరా",

సర్వకార్యములు సమర్థవంతముగా చేయుటవలన "శక్తి",

తన శక్తిచే రంజింపజేయుటవలన "రాజ్ఞి",

స్వస్వరూప స్థితిలో,ప్రశాంతముగా ఉన్నందున "శాంత",

సృష్టి ఉద్భవించినందున(తననుండి) "ప్రకృతి",

ఆశ్రితుల ప్రార్థన విని,కష్టాలను తీర్చి,వారిని సంసార సాగరంనుండి గట్టెంకించి,తన వద్దకు చేర్చుకోవటం వలన "శాయే",

జ్ఞానులు,యోగుల,శరణాగతుల హృదయమందు వాత్సల్యముచే రమించునది కావున "రమ",

సత్త్వ,రజో,తమో అను త్రిగుణములకు మూలమైనందున "త్రిగుణా",

నారాయణుడి సతీమణి అయినందున "నారాయణి", ఎల్లప్పుడు అతనికి నిత్యానపాయనియై,నారాయణుడిని కొలిచే ఆశ్రితులకు శుభములు చేకూర్చుచున్నందున "శ్రీ".

ఇలా ఎన్నో తత్త్వములు,అవతారములు.

జయ శ్రీమన్నారాయణ.

 #మనదేవాలయాలు #మనదేవాలయాలు_మనసంపద #లింబద్రిగుట్ట #భీంగల్  శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -భీమగల్--------------------...
03/08/2024

#మనదేవాలయాలు
#మనదేవాలయాలు_మనసంపద
#లింబద్రిగుట్ట
#భీంగల్



శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -భీమగల్
---------------------------------------------------------

లింబాద్రి గుట్ట ( నింబా చాల ) క్షేత్రం నిజామాబాదు జిల్లాలోని భీమగల్ పట్టణానికి 5 కి మీ దూరం లో వెలసిన ప్రసిద్ద లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం .

భీమగల్ నుండి 5 కి మీ దూరం లో గల గుట్ట పైన స్వయం భు గ వెలసిన మహిమన్మితమైన క్షేత్రం . బ్రహ్మ వ్యవర్తక పురాణం లో,శ్రీమాన్ నిమ్బాచల మహత్యం లో ఈ క్షేత్రం గురుంచి చెప్పాడం జరిగింది . బ్రహ్మ మరియు ప్రహలదుల కోరిక మేరకు నరసింహ స్వామి ఈ క్షేత్రం లో కొలువై ఉన్నాడు అని స్వామి వారు మహాలక్ష్మి అమ్మ వారిన తన తోడ పైన కుర్చుబెట్టుకొని కనిపిస్తాడు .ఒక గుట్ట పైన స్వామి వారు వెలిశారు.
స్వామి వారి పూజ కార్యక్రమాలు అన్ని మధ్వ సాంప్రదాయం ప్రకారం నిర్వహించాబడుతాయి . ఈ క్షేత్రం లో భక్తులు నియమ నిష్టలతో స్వామి వారిని దర్శించుకోవాలని నియమం కూడా ఉంది .

స్వామ్రి వారితో పాటు నారనారాయణ ( కృష్ణ ,అర్జున ) ,పరమ వైష్ణవ హనుమాన్ ,గరుడ ,మద్వాచార్య స్వాముల వారు కొలువు తీరారు . భాద్రినాథ్ తరువాత ఇక్కడే స్వయం భు నారా నారాయణ లను ఒకే దగ్గర పూజిస్తారు అని కథనం .దేశం లోనే నారా నారాయణ లను ఒకే దగ్గర పూజించే రెండవ దేవాలయం అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ బద్రినాథ అని కూడా పిలుస్తారు .

ఈ కొండ పైన వివిధ దేవా గణాలు అందరు వివిధ రూపాలలో వెలిశారు అని స్థల పురాణం చెబుతుంది . ఈ క్షేత్ర మహత్యం గురుంచి మహర్షి సుత సౌనకది ఋషులకు వివరించడం జరిగింది అని పురాణం గాథ .

ఒకప్పుడు కొండ పైన మొత్తం నిమ్బు చెట్లు ఉండేవి అట అందుకే ఈ స్థలాన్ని నిమ్బాచాలా మహత్యం అని కుడా అనేవారు . చాల శక్తి వంతమైన ,మహిమన్మితమైన క్షేత్రం .ఈ క్షేత్రం లో చింతామణి పుష్కరాని కూడా ఉంది .

స్వామి వారు ఉత్సవ మూర్తుల విగ్రహాలు భీమగల్ పట్టాన కేంద్రం లో గల ఉత్సవ స్వామి దేవాలయం లో గలవు . అన్ని సమయాల్లో వాటిని ఉరేగించడం జరుగుతుంది . స్వామి వారిని దర్శించే ప్రతి ఒక్కరు ఈ ఉత్సవ మూర్తులను దర్శించుకుంటే నే క్షేత్ర దర్శన ప్రాప్తి లబిస్తుంది అని చెబుతారు .

ఈ క్షేత్రం మహత్యం వివరాలు మరి కొన్ని :-

శ్రీ కృష్ణావతారం ముగియగాన శ్రీ కృష్ణుడు యుదిస్ట్రునితో ఈ విదముగా చెప్పను. నేను మరియు అర్జునుడు నారనారాయణ రూపం లో భాద్రినాత్ మరియు బీమచల్ గుట్ట పైన వెలసి ఉంటాము. నువ్వు అక్కడికి వెళ్లి మమ్మల్ని పూజించు అని వివరించడం జరిగింది అని చెబుతారు .

త్రేతా యుగం లో శ్రీ రాముడు ,సీత లక్షమన సమేతంగా ఈ క్షేత్రాన్ని దర్సించాడని ,శ్రీ రామును అజ్ఞానుసారంగా హనుమ ఇక్కడ తప్పస్సు చేయడం జరిగింది అని స్వామి వారి అజ్ఞానుసరంగా ఇక్కడ కొలువై ఉన్నాడు.

పరమ శివుడు బ్రమ్హ హత్య పతకం తరువాత ఇక్కడ వచ్చి తన దోషము పోగొట్టుకున్నాడు అని స్వామి వారి కోరిక మేరకు జోడులింగాలు అయి ఇక్కడ కొలువై ఉన్నాడు . బ్రమ్హ దేవుడు కూడా ఇక్కడ తన దోష పరిహారార్థం కొరకు ఇక్కడ ఉన్నాడు అని స్థల పురాణం జేబుతుంది .

ఇక్కడ ఉన్న పుష్కర్నిని కమలా పుష్కరిణి అని కూడా పిలుస్తారు . నారసింహ ఆవతార సమయం లో శ్రీ మహాలక్ష్మి అమ్మ వారు స్వామి వారి కోపం,అగ్రహ,ఆవేశాలను చూడలేక కొద్దిసేపు పుష్కరిణి లో కమలాకరం లో కొలువై ఉన్నారు అట అందుకే పుష్కరిణి కి కమలా పుష్కరిణి అని కూడా పిలుస్తారు

బ్రమ్హ అజ్ఞానుసారంగా యమదర్మ రాజు ఇక్కడ తపస్సు చేసాడట .ఆ తరువాత స్వామి వారి కోరిక పైన గుట్ట పైన బిల్వారుక్షం ( పత్రి రుక్షం) రుపంల్ లో కొలువై ఉన్నాడట . అందుకీ ఇక్కడ స్వామి వారికి ఆ పత్రి లతో పూజ చేయడం జరుగుతుంది . శ్రీ మహా విష్ణువు కి ఎక్కడ పత్రి ల తో పూజ చేయడం జరగదు .



మీ శ్రేయోభిలాషి
గిరీష్

అద్భుతం
28/07/2024

అద్భుతం

24/07/2024

బుధవారం ను పురస్కరించుకుని మా ఆంజనేయ క్షేత్రం లో రాకంచెర్ల భజన కార్యక్రమాలు

 #మనదేవాలయాలు_మనసంపద  #మనదేవాలయాలు  #దయాచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి ప్రతి ఒక్కరు తప్పకుండా షేర్ చేయండి..అందరికి తె...
23/07/2024

#మనదేవాలయాలు_మనసంపద
#మనదేవాలయాలు
#దయాచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి

ప్రతి ఒక్కరు తప్పకుండా షేర్ చేయండి..అందరికి తెలిసేలా చేయండి..ఎన్ని సార్లు చదివిన మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించే పోస్ట్ ఇది.

ఎవరు రాసారో తెలియదు కానీ అత్యద్భుతంగా ఉంది

ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు .

మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన - ఆదర్శ పురుషుడు

మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన - అద్దం - రాముడు .

ధర్మం పోత పోస్తే రాముడు
ఆదర్శాలు రూపుకడితే రాముడు .
అందం పోగుపోస్తే రాముడు
ఆనందం నడిస్తే రాముడు

వేదోపనిషత్తులకు అర్థం రాముడు
మంత్రమూర్తి రాముడు .
పరబ్రహ్మం రాముడు .
లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు

ఎప్పటి త్రేతా యుగ రాముడు ?
ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ?
అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే

చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -

శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.

బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన
పాట -
రామాలాలీ - మేఘశ్యామా లాలీ

మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష.

మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా

వినకూడని మాట వింటే అనాల్సిన మాట -
రామ రామ

భరించలేని కష్టానికి పర్యాయపదం -
రాముడి కష్టం .

తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు

కష్టం గట్టెక్కే తారక మంత్రం
శ్రీరామ .

విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ .

అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా

వయసుడిగిన వేళ అనాల్సిన మాట -
కృష్ణా రామా !

తిరుగులేని మాటకు - రామబాణం

సకల సుఖశాంతులకు - రామరాజ్యం .

ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన

ఆజానుబాహుడి పోలికకు - రాముడు

అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు

రాముడు ఎప్పుడూ మంచి బాలుడే .

చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా -
Rama killed Ravana ;

Ravana was Killed by Rama .

ఆదర్శ దాంపత్యానికి సీతారాములు

గొప్ప కొడుకు - రాముడు

అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు

గొప్ప విద్యార్ధి రాముడు
(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .

మంచి మిత్రుడు- రాముడు
(గుహుడు చెప్పాడు).

మంచి స్వామి రాముడు
(హనుమ చెప్పారు).

సంగీత సారం రాముడు
(రామదాసు , త్యాగయ్య చెప్పారు) నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం
(పిబరే రామరసం)
సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)

కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు జన్మ తరించడానికి - రాముడు , రాముడు, రాముడు .

రామాయణం పలుకుబళ్లు

మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది .

తెలుగులో కూడా అంతే .

ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని
అడిగినట్లే ఉంటుంది ...

చెప్పడానికి వీలుకాకపోతే -
అబ్బో అదొక రామాయణం .

జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే
సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .

ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే -
అదొక పుష్పకవిమానం

కబళించే చేతులు , చేష్టలు
కబంధ హస్తాలు .

వికారంగా ఉంటే -
శూర్పణఖ

చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).

పెద్ద పెద్ద అడుగులు వేస్తే -
అంగదుడి అంగలు.

మెలకువలేని నిద్ర
కుంభకర్ణ నిద్ర

పెద్ద ఇల్లు
లంకంత ఇల్లు .

ఎంగిలిచేసి పెడితే -
శబరి

ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు

అల్లరి మూకలకు నిలయం
కిష్కింధ కాండ

విషమ పరీక్షలన్నీ మనకు రోజూ -
అగ్ని పరీక్షలే .

పితూరీలు చెప్పేవారందరూ -
మంథరలే.

సాయం చేసినపుడు- ఉడుత భక్తి..
కార్యాన్ని సాధించినపుడు -హనుమ యుక్తి..
గొడవ కు దిగే వాళ్ళ పేరు - లంకిని

యుద్ధమంటే రామరావణ యుద్ధమే .

ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -
(రావణ కాష్టాలే .)

కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది
(ఇది విచిత్రమయిన ప్రయోగం ).

సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు . బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు

ఒంటిమిట్టది ఒక కథ ..
భద్రాద్రిది ఒక కథ
అసలు రామాయణమే మన కథ .
అది రాస్తే రామాయణం
చెబితే మహా భారతం

అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు హిందుయిజమ్ ఒక మతం కాదు
అది ఒక జీవన విధానం

అందుకే ఇప్పటి South Asian దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాలో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు

రామాయణకథలు మనకంటే చక్కగా Muslim majority దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు

జై శ్రీ రామ్.....

|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది

జై శ్రీరామ్

ప్రతి నిత్యం దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక సమాచారం కోసం మన దేవాలయాలు మన వైభవం గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

మి శ్రేయోభిలాషి
గిరీష్

 #మనదేవాలయాలు_మనసంపద  #మనదేవాలయాలు  #దయాచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి వ్యాసపూర్ణిమ /గురు పౌర్ణమి శుభాకాంక్షలు!! వ్యా...
20/07/2024

#మనదేవాలయాలు_మనసంపద
#మనదేవాలయాలు
#దయాచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి

వ్యాసపూర్ణిమ /గురు పౌర్ణమి శుభాకాంక్షలు!!

వ్యాసాయ విష్ణు రూపాయ
వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మ నిధయే
వాసిష్టాయ నమో నమ |

వ్యాసం వశిష్ట నప్తారం శక్తేః పౌత్రం అకల్మషం, పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం"

వసిష్ఠమహామునికి మునిమనుమడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరమునికి పుత్రుడు, శుకమర్షికి జనకుడైనట్టియు, నిర్మలుడైనట్టి, తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము.

ఆదిగురువు వేదవ్యాసులవారు.

వ్యాసులవారు పుట్టినరోజునే వ్యాసపూర్ణిమ/గురుపూర్ణిమ అంటారు

నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు.

అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు.
వేదవిభజన చేసిన మహానుభావుడాయన.

ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు.

వ్యాసపూర్ణిమ నాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి.

గురుబ్రహ్మ,గురుర్విష్ణుః,
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః

ఆచార్యులవారిని అంటే గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలనేది ఋషివచనం. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు.

అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి.

"గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్తకబీర్ దాస్.

అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ తొలి గురువైన ఆ వ్యాసభగవానుని సేవించాలి.

 #మనదేవాలయాలు_మనసంపద  #మనదేవాలయాలు  #దయాచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి వ్యాస పౌర్ణమి / గురు పౌర్ణమి శుభాకాంక్షలు వ్యా...
20/07/2024

#మనదేవాలయాలు_మనసంపద
#మనదేవాలయాలు
#దయాచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి

వ్యాస పౌర్ణమి / గురు పౌర్ణమి శుభాకాంక్షలు

వ్యాస పౌర్ణమి శుభ సందర్భంగా ప్రతి ఒక్కరు గురు స్తోత్రాలు,విష్ణు సహస్రనామ, దక్షిణ మూర్తి స్తోత్రం పఠనం సర్వదా శ్రేయస్కరం!!

🌼🌿విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం🌼🌿

జీవితమన్నాక ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి .. మరెన్నో సమస్యలు పలకరిస్తుంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు .. అనారోగ్య కారణాలు మానసికంగా కుంగదీస్తుంటాయి. జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడానికి, పూర్వజన్మలో చేసిన పాపాలే కారణమనేది పెద్దల మాట. పాపాలను హరించే శక్తి భగవంతుడి నామానికి వుంది. అందువలన అనునిత్యం దైవ నామస్మరణ చేస్తుండాలని పెద్దలు చెబుతుంటారు.

ఇక కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న సమయంలో, విష్ణు సహస్రనామ పారాయణానికి మించిన విరుగుడు లేదని అంటారు. జీవితంలో రకరకాల సమస్యలు సతమతం చేస్తున్నప్పుడు, అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఈ విధంగా చేయడం వలన కష్టాలు .. బాధలు .. వ్యాధులు తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ .. ఉత్తమగతులు కలుగుతాయనేది మహర్షుల మాట.

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when మన దేవాలయాలు మన వైభవం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to మన దేవాలయాలు మన వైభవం:

Share