మన దేవాలయాలు

మన దేవాలయాలు Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from మన దేవాలయాలు, Tour guide, Hyderabad.

Manatemples.in is a website which gives complete information of temples of Telangana and Andhra Pradesh.

temples





తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న అన్ని స్వయం భు దేవాలయాలు(చిన్న,పెద్ద) మరియు పురాతన దేవాలయాలు అన్నింటిని ఒకే దగ్గర కనిపించేలా చేసి వాట

ిని వేలుగోలోకి తీసుకోని రావలని.. ఎవరికి తెలియని చాల పురాతన దేవాలయాలు ను అందరికి తెలుస్తాయి అన్న మంచి ఉద్దెశ్యం తో మేము చేస్తున్న చిన్న ప్రయత్నం!! ఈ మా చిన్న ప్రయత్నం లో ఏవైనా అక్షర దోషాలు ఉన్న, సమాచారం లో ఏదైనా లోపాలు ఉన్న పెద్ద మనసుతో మీరు మన్నించి మాకు సరి ఆయన సమాచారం అందిస్తారు అని మా మనవి .

మీరు మీ చుట్టూ ప్రక్కల ఏవైనా పురాతన దేవాలయాలు ఉంటె దయచేసి వాటికీ సంబందించిన వివరాలు మరి వాటికీ సంబందించిన చిత్రాలు తీసి [email protected] కి పంపించగలరు అని ప్రార్ధన!!

11/04/2026

శనివారం ను పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలో కొలువైన ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారికి

అభిషేకం
పంచామృత అభిషేకం
తమలపాకుల పూజ
తులసీదళ అర్చన

కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

దాతలందరి గోత్ర నామాలతో స్వామి వారికి ప్రత్యేక అర్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

స్వామి వారి కృపా కటాక్షములు అందరి పైన చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ

జై శ్రీరామ్!!

08/04/2026

హనుమాన్ జయంతి (విజయోత్సవ యాత్ర ) సందర్భంగా వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామం లో సీతా రామ లక్ష్మనులను ఊరేగింపుగా గ్రామమంతా భజన కార్యక్రమాలతో ఊరేగింపుగా తీసుకొని వెళ్ళడం జరిగింది..

06/04/2026

హనుమాన్ జయంతి (విజయోత్సవ యాత్ర) సందర్భంగా వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలో…

04/04/2026

నమస్తే
జై శ్రీరామ్

నేడు శనివారం ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలో కొలువైన ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారికి

#పంచామృత అభిషేకం
#తమలపాకుల పూజ
#తులసీదళ అర్చన

నిర్వహించడం జరిగింది.

దాతలందరి గోత్ర నామాలతో స్వామి వారికి ప్రత్యేక అర్చన నిర్వహించడం జరిగింది.

స్వామి వారి కృపా కటాక్షములు అందరి పైన చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ












ఇట్లు
గిరి పంతులు

22/03/2026

సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం, చీనూర్ గ్రామం, కామారెడ్డి జిల్లా
--------------------------------------------------------------------
కృష్ణం వందే జగుద్గురం !! సర్వ లోక రక్షకుడు శ్రీ కృష్ణ పరమాత్ముడు !! అటువంటి జగన్నటకదారి అయిన శ్రీ కృష్ణ మహానుబవునికి అడుగడుగునా గుడులే !! అటువంటి దివ్య క్షేత్రాల్లో ఒకటైన సంతన వేణుగోపాల స్వామి దేవాలయం కామారెడ్డి జిల్లా లో నాగిరెడ్డి పెట్ మండల కేంద్రం లో గల చీనూర్ గ్రామం లో వెలసిన అద్బుతమైన క్షేత్రం !!

700 సంవత్సరాల క్రితం నిజం రాజుల కాలం లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు గారి స్వప్నం లో భగవత్ రూపం లో ఒక్క వ్యక్తి కనిపించి గ్రామానికి చివరలో ఉన్న కొలనులో వేణుగోపాల స్వామి విగ్రహ రూపం లో ఉన్నాడు దాన్ని వెతికి తీసి దేవాయలం నిర్మించాలని చెప్పి అతను అధ్రుస్య్మయ్యాడు అట .ఆ తరువాత రోజు రాజు గారు తన సైన్యం తో ఆ కొలను ను దర్శించి అక్కడ వెతకమని ఆదేశించాడు అట .చాల ప్రయత్నం తరువాత వాళ్ళకి ఒక సుందర విగ్రహం రెండున్నర అడుగుల వేణు గోపాల స్వామి వారిది రుక్మిణి ,సత్యభామల తో దొరికింది.
స్వామి వారి విగ్రహాల తో పాటు శ్రీ సుదర్శన్ పెరుమాళ్,శ్రీమన్నారాయణ విగ్రహాలు దొరుకగ వాటిని తీసుకోని వచ్చి రాజు గారు ఒక అద్బుతమైన దేవాలయాన్ని నిర్మించి స్వామి వార లను ప్రతిష్టించారు అని స్థల పురాణం ! స్వామి వారి విగ్రహాల తో పాటు నమ్మాళ్వార్,భగవద్ రామానుజుల విగ్రహాలు ప్రతిష్టించారు.స్వామి వారికి జరిగే పూజలు,విశేష పర్వదినాల్లో జరిగే కార్యక్రమాలు ఎంతో రమణీయంగా,కన్నుల పండుగగా ఆగమ శాస్త్రాల ప్రకారం జరుగుతాయి .

ఈ దేవాలయం లో వెలసిన వేణుగోపాల స్వామి ని సంతాన వేణు గోపాల స్వామి గా ప్రసిద్దిగాంచాడు !ఎవరైతే ఈ క్షేత్రం లో స్వామి వారిని మానస వాచా ఆ స్వామి వారిని కొలిచి పూజిస్తారో వాళ్ళకి మంచి సంతానాన్ని ప్రసాదిస్తారని అనాదిగా భక్తుల నమ్మకం !!

ఈ ఆలయం లో వెలసిన మరో సుందర విగ్రహం శ్రీ సుదర్శన పేరుమల్ స్వామి వారిది.ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ స్వామి కి అభిషేకం,హోమం వంటి దివ్యమైన పూజలు జరిపిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్య అయిన తొలిగి పోతుంది అని నమ్మకం !

స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా జరుగుతుంది ! ఆ కార్యక్రమం చూడడానికి రెండు కళ్ళు సరిపోవ అన్న విదంగా జరిపిస్తారు.స్వామి వారి కళ్యాణ మహోత్సవం లో పాల్గొనే వారికి కోరిన కోరికలు నేరవరుతాయని నమ్మకం!

ప్రతి ఒక్కరు తప్పకుండ ఈ క్షేత్రాన్ని దర్శించి ఆ జగన్నాథుని కృప కటక్షాలు పొందాలని మనవి !

సర్వం శ్రీ క్రిష్ణర్పనమస్తు !

సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం,
చీనూర్ గ్రామం, నాగిరెడ్డి పెట్ మండలం,కామారెడ్డి జిల్లా
దేవాలయం నెంబర్:-9441049068



నమస్తే జై శ్రీరామ్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలో కొలువైన ఆంజనేయ స్వామి ఆలయం సుమారు 8 దశాబ్దాల...
17/03/2026

నమస్తే
జై శ్రీరామ్

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలో కొలువైన ఆంజనేయ స్వామి ఆలయం సుమారు 8 దశాబ్దాల చరిత్ర కలిగిన శక్తివంతమైన ఆంజనేయ క్షేత్రం..గ్రామానికి చివరలో వాగు ఒడ్డున స్వయంభు గా వెలసిన దివ్యమైన హనుమ క్షేత్రం..స్వామి వారి దర్శనం ద్వారా ఆర్ధిక ఇబ్బందులు,అనారోగ్య సమస్యలు,గ్రహ సంబంధిత సమస్యలు తప్పకుండా తొలిగిపోతాయి..కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం స్వామి ..

పరాభావ నామ సంవత్సరం చైత్రమాసం పాడ్యమి(ఉగాది ) తిథి నుండి మా ఆంజనేయ స్వామీ వారి సన్నిధి లో వార్షిక అర్చన కార్యక్రమం(365 రోజులు) మొదలు పెట్టడం జరుగుతుంది..

అందరు మి గోత్ర నామాలు పంపించి ఇ సేవ ను వినియోగించు కొగలరు.

వివరాలు పంపించిన వారి అందరి గోత్ర నామాలతో ప్రతి నిత్యం అర్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

ప్రతి ఒక్కరూ ఈ సేవ కు సంబంధించిన రుసుము సంవత్సరానికి 1200/- (నెలకు 100 rs) పంపగలరు.

నోట్;- వార్షిక చందాతో దేవాలయం లో అభివృద్ధి పనులు ,ఇతరత్రా సౌకర్యాలు అందుబాటులో తీసుకొని రావాలని సంకల్పం తో ..దేవాలయ అభివృద్ధి చేయాలని ఆకాంక్ష తో గొప్ప కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది…

మీరు గొప్ప కార్యక్రమం లో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి .

Gpay or Phone pe:- 9866933582

ఇట్లు
ఆలయ అర్చకులు
వెంకట గిరి చార్యులు.

17/03/2026

#శ్రీరాముడు అవతార పరిసమాప్తి
చేసేటపుడు సరయూ నదివద్ద
స్వామి హనుమను #అడుగుతాడు

హనుమా !
నువ్వు కూడా నాతో వస్తావా ? అని ..

దానికి #హనుమ .. రామా నువ్వొకటి
నేనొకటినా ? అనగానే దానికి రాముడు
#ఎంతకాలం ఈ లోకంలో రామ నామము

#కీర్తింపబడుతుందో అంతకాలం
ఈ లోకంలో నువ్వు ఉండు హనుమా !
అని ఆజ్ఞాపించాడు......

అంజనేయ స్వామి దేవాలయము
పెద్ద ఉమ్మెంతాల్ గ్రామం
పూడూరు మండలం
వికారాబాద్ జిల్లా

# జై శ్రీరామ్

14/03/2026

శ్రీ ఆంజనేయస్వామి వారు ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు కీర్తనలు చేస్తూ ఉంటారో! అచ్చోట ఆనంద బాష్పాలతో చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్షమవుతారు .ఏ ఇంట్లో ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో హనుమంతుని పూజిస్తారో! ఆ యింట్లో హనుమంతుని ప్రభావంవల్ల "మహాలక్ష్మి" స్థిరముగా ఉంటుంది.

ప్రతి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేద్దాం!రామబంటు హనుమ కృపకు పాత్రులు ఆవుదాం!

#జైహనుమాన్
#శ్రీరామజయరామజయజయరామ
#రామనామమేమనకురక్షదేశనికిరక్ష
#ఓహిందుమేలుకోనిస్వధర్మాన్నిపాటించుకో
#భారతీయసంస్కృతిప్రపంచానికివేదగురువు

14/03/2026

శ్రీ మహా కాళేశ్వరుడు-ఉజ్జయిని
------------------------------------

ద్వాదశ జ్యోతిర్లింగా క్షేత్రాలలో ఒకటి శ్రీ మహా కాళేశ్వరాలయం మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఉజ్జయినీ పట్టణంలో ఈ దేవాలయం "రుద్రసాగరం" సరస్సు సమీపాన ఉంది. మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం.
ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని "దక్షిణామూర్తి" అని కూడా అంటారు. అనగా ఈవిగ్రహం ముఖం దక్షివైపు ఉంటుంది. ఈ ఏకైక లక్షణం ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ దేవాలయంలోని గర్భగుడిలో "ఓంకారేశ్వర మహాదేవ" విగ్రహం మహాకాల విగ్రహం పైన ఉంటుంది.
ఉజ్జయినిలో శివ లింగాలు మూడంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కన్నా కింద ఉండేది మహా కాళ లింగం. మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆపైన ఉండేది నాగేంద్ర స్వరూపమయిన లింగం. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర ‘పర్జన్యానుష్ఠానం’ అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది.

ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖుయంత్రం అనే చాలా ఆశ్చర్యకరమయిన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు.ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖయంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నయినా పొందుతాడు.

ఈ ప్రాంగణంలో పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు, సాక్షిగోపాలుడు, శనీశ్వరుడుతోపాటు అనేక శివలింగాలు భక్తులకు దర్శనం ఇస్తాయ. మహాకాల్ మందిర శోభ సంధ్యా సమయంలో అత్యంత మనోహరమై భాసిల్లుతుంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ శివుడ్ని ఇక్కడ మహాకాల్గా కొలువై ఉండమని ప్రార్థించాడనీ, ఆ బ్రహ్మ అభీష్టం మేరకు శివుడిక్కడ కొలువై ఈ మందిరానికింతటి శోభనిస్తున్నాడనే పురాణకథలు వినిపిస్తాయ.

ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమయిన మందిరం ఉంది. దానిని భస్మ మందిరమని పిలుస్తారు. అక్కడ ఆవుపేడతోవిభూతిని తయారుచేస్తారు. భస్మమందిరంలోకి ఆవుల్ని తీసుకు వచ్చి వాటి పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటటువంటి విభూత్యాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది. తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు.అలా కొట్టినప్పడు ఒక్క శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, భేరీలు, పెద్దపెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. అపుడు అక్కడ మీరు ఒక అలౌకికమయిన స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. రెండవ రకం అభిషేకంలో పురుషుల్ని సంప్రదాయక దుస్తులతో తెల్లవారు జామున దేవాలయం లోపలికి పంపిస్తారు.అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు

12 సంవత్సరాల కొకసారి ఈ క్షేత్రంలో కుంభమేళా జరుగుతుంది. అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ క్షేత్రాన మరణించినవారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి.
శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి వారికి “భస్మ హారతి” (అస్థికలు సమర్పణ) రొజూ ఉదయం 4 గంటలకు తప్పనిసరి ఆచారంగా త్రయంబకేశ్వరునికి సమర్పిస్తారు. ఈ భస్మాన్ని అర్చకులు పట్టుకు వచ్చి ఇస్తారు. ఆ భస్మపాత్రను అందరికీ ఇస్తారు. చుట్టూ
కూర్చుని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు.

ఆర్తి సమయంలో మంత్రాలు జపించడం, గంభీరమైన ధ్వనులు చేయటం వల్ల గర్భగుడి శక్తివంతమైన ప్రకంపనాలతో మార్మోగిపోతుంది. ఇది మనిషి జీవిత కాలంలో మరిచిపోలేని అద్భుతమైన అనుభవం.
ఈ భస్మహారతి 10 మంది నాగ సాధువుల ద్వారా జరుగుతుంది ఈ భస్మ హారతి సమయంలో ఎవరిని గర్భగుడిలోనికి అనుమతించరు. కేవలం పురుషులకు మాత్రమే ఈ భస్మ హారతిలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. స్త్రీలను ఈ హారతిలో పాల్గొనటంకాని, చూడటానికి కానీ అనుమతించరు. భక్తులను గర్భగుడి బయట ఉన్న నంది మంటపంలో, బారికేడ్లు వెనుకకు అనుమతించబడతారు

శక్తి పీఠం
----------
పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనిపేరు. అవంతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటిది స్త్రీ. రెండోది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తూ జగదాంబ అయిన అమ్మవారి స్వరూపము. మన దేశంలో ఉన్న ఏడు మోక్ష పట్టణాలలో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒకపక్క మహాకాళుడితో ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతే ప్రసిద్ధి పొందింది.

14/03/2026

నమస్తే
జై శ్రీరామ్

శనివారం ఏకాదశి ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలో కొలువైన ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారికి

#పంచామృత అభిషేకం
#సింధూర అభిషేకం
#తమలపాకుల పూజ
#తులసీదళ అర్చన

నిర్వహించడం జరిగింది.

దాతలందరి గోత్ర నామాలతో స్వామి వారికి ప్రత్యేక అర్చన నిర్వహించడం జరిగింది.

స్వామి వారి కృపా కటాక్షములు అందరి పైన చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ












ఇట్లు
గిరి పంతులు

వ్యాస రాయ ప్రతిష్ఠపిత ఆంజనేయ స్వామి. ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.------------------------------------------------కర్నూల్ ...
12/03/2026

వ్యాస రాయ ప్రతిష్ఠపిత ఆంజనేయ స్వామి. ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.
------------------------------------------------
కర్నూల్ జిల్లా లోని ఎమ్మిగనూరు లో కొలువైన వ్యాసరాయ ప్రతిష్ఠిత ఆంజనేయ క్షేత్రం ఎంతో పురాతనమైన మరియు శక్తివంతమైన క్షేత్రం.

ఇ క్షేత్రం లో మద్వ సంప్రదాయం ప్రకారం పూజ కార్యక్రమలు నిర్వహిస్తారు..మంత్రాలయం వెళ్లే ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం.

ఉపవాసం-ప్రాముక్యత------------------------మన సంస్కృతి లో ఉపవసానికి చాల ప్రాముక్యత ఉంది .వివిధ విశేష పర్వదినాల్లో ఉపవాసం ఉ...
11/03/2026

ఉపవాసం-ప్రాముక్యత
------------------------
మన సంస్కృతి లో ఉపవసానికి చాల ప్రాముక్యత ఉంది .వివిధ విశేష పర్వదినాల్లో ఉపవాసం ఉంది ఆ మరుసటి రోజు పూజ కార్యక్రమలు పూర్తి చేసుకొని భోజనం చేయడం ఆచారంగా పాటిస్తూ వస్తున్నాము.అలా ఉపవాసం ఉండడం వలన మనకు కలిగే ప్రయోజనాలు చాల కలుగుతాయి.
మన దేశంలో ఆయా వర్గాలకు చెందిన వారు తాము పూజించే దైవం కోసం ఉపవాసం ఉంటుంటారు. అలా చేస్తే పుణ్యం వస్తుందని భావిస్తారు. అలాగే కొందరు ఆరోగ్యం బాగుండాలని చెప్పి కూడా ఉపవాసం చేస్తుంటారు. అయితే నిజానికి ఉపవాసం చేయడం వెనుక ఉన్న కారణం ఏదైనప్పటికీ.. ఉపవాసం చేయడం వల్ల మనకు పలు లాభాలే కలుగుతాయి.
1. ఉపవాసం చేయడం వల్ల వృద్ధాప ఛాయలు అంత త్వరగా రావట. ఎందుకంటే ఉపవాసంలో ఉన్నప్పుడు మన శరీరం కొత్త కణాలను నిర్మించుకోవడంతోపాటు, పాత కణాలకు మరమ్మత్తులు చేసుకుంటుందట. దీంతో కణాల నూతనోత్తేజాన్ని పొందుతాయి. ఇది యాంటీ ఏజింగ్ ప్రభావాన్ని కలిగిస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు.
2. ఉపవాసం వల్ల మెదడు పనితీరు బాగా పెరుగుతుందట. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారట.
3. ఉపవాసం చేస్తే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు లాంటి స్వల్ప అనారోగ్య సమస్యలు నయమవుతాయి.
4. అప్పుడప్పుడు ఉపవాసం చేస్తే క్యాన్సర్ కూడా నయమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఉపవాసం వల్ల క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.

మీ శ్రేయోభిలాషి
గిరీష్

Address

Hyderabad
500081

Alerts

Be the first to know and let us send you an email when మన దేవాలయాలు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to మన దేవాలయాలు:

Share

Category