మన దేవాలయాలు

మన దేవాలయాలు Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from మన దేవాలయాలు, Tour guide, Hyderabad.

Manatemples.in is a website which gives complete information of temples of Telangana and Andhra Pradesh.

temples





తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న అన్ని స్వయం భు దేవాలయాలు(చిన్న,పెద్ద) మరియు పురాతన దేవాలయాలు అన్నింటిని ఒకే దగ్గర కనిపించేలా చేసి వాట

ిని వేలుగోలోకి తీసుకోని రావలని.. ఎవరికి తెలియని చాల పురాతన దేవాలయాలు ను అందరికి తెలుస్తాయి అన్న మంచి ఉద్దెశ్యం తో మేము చేస్తున్న చిన్న ప్రయత్నం!! ఈ మా చిన్న ప్రయత్నం లో ఏవైనా అక్షర దోషాలు ఉన్న, సమాచారం లో ఏదైనా లోపాలు ఉన్న పెద్ద మనసుతో మీరు మన్నించి మాకు సరి ఆయన సమాచారం అందిస్తారు అని మా మనవి .

మీరు మీ చుట్టూ ప్రక్కల ఏవైనా పురాతన దేవాలయాలు ఉంటె దయచేసి వాటికీ సంబందించిన వివరాలు మరి వాటికీ సంబందించిన చిత్రాలు తీసి [email protected] కి పంపించగలరు అని ప్రార్ధన!!

భగవత్ బంధువులందరికీ నమస్తే నేడు పాల్గుణ మాసము శనివారం ని (22.03.2025) పురస్కరించుకుని  గ్రామం లో కొలువైన ఆంజనేయ స్వామి ద...
22/03/2025

భగవత్ బంధువులందరికీ
నమస్తే

నేడు పాల్గుణ మాసము శనివారం ని (22.03.2025) పురస్కరించుకుని గ్రామం లో కొలువైన ఆంజనేయ స్వామి దేవాలయం లో స్వామి వారికి పంచామృత అభిషేకం,తమలపాకుల పూజ,తులసీదళాల అర్చన కార్యక్రమలు నిర్వహించడం జరిగింది

పూజాది కార్యక్రమాల తరువాత తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

స్వామి వారి కృపా కటాక్షాలు,చల్లని ఆశీస్సులు అందరి పైన చల్లగా ఉండాలని ప్రార్థించడం జరిగింది.

Note;- దేవాలయం లో ప్రతినిత్యం దాతలందరి గోత్ర నామాలతో స్వామి వారికి అర్చన అభిషేక (వార్షిక సేవ కార్యక్రమం) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

సేవ కార్యక్రమమ్ లో మీ గోత్ర నామాలు పొందుపరచాలి అనుకున్న వారు నాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయగలరు.

ఇట్లు
గిరి పంతులు
91-9866933582

గోదావరి నదిలో ఉపనది ప్రాణహిత కలిసే చోట ఉన్న క్షేత్రమే కాళేశ్వరం .త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆ...
21/03/2025

గోదావరి నదిలో ఉపనది ప్రాణహిత కలిసే చోట ఉన్న క్షేత్రమే కాళేశ్వరం .త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమన్మితమైనది .
కరీంనగర్ పట్టణానికి 132 కి మీ దూరం లో మంథని సమీపం లో దట్టమైన అడవి ,చుట్టూ ప్రకృతి రామయనితల మద్య ,గోదావరి నదికి దగ్గరలో వెలసిన ఈ క్షేత్రం చాల పురాతనమైనది . స్కాందపురాణం లో ఒక కాండం కాళేశ్వర క్షేత్ర మహత్యాన్ని వివరిస్తుంది .

For Full Information Please Click the Below Link

This website which gives complete information about the temples of Telangana & Andhra Pradesh.

నమస్తే శనివారం శుభాకాంక్షలుమాఘ మాసము శనివారం ని (15.02.2025) పురస్కరించుకుని  వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మె...
15/02/2025

నమస్తే
శనివారం
శుభాకాంక్షలు

మాఘ మాసము శనివారం ని (15.02.2025) పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామం లో కొలువైన ఆంజనేయ స్వామి దేవాలయం లో స్వామి వారికి అభిషేకం,తమలపాకుల పూజ,తులసీదళాల అర్చన కార్యక్రమలు నిర్వహించడం జరిగింది

పూజాది కార్యక్రమాల తరువాత తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

స్వామి వారి కృపా కటాక్షాలు,చల్లని ఆశీస్సులు అందరి పైన చల్లగా ఉండాలని ప్రార్థించడం జరిగింది.

దేవాలయం లో జరుగుతున్న అభివృద్ధి పనులకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ

ఇట్లు
గిరి పంతులు

 #తిరుమల #కలియుగవైకుంఠంతిరుమల #శ్రీనివాసుడు  #తిరుపతి  #గోవిందనామలుగోవింద అంటే చాలు మనలోని దుఃఖాన్ని పోగొట్టి మనకు దారి ...
14/02/2025

#తిరుమల
#కలియుగవైకుంఠంతిరుమల
#శ్రీనివాసుడు
#తిరుపతి
#గోవిందనామలు

గోవింద అంటే చాలు మనలోని దుఃఖాన్ని పోగొట్టి మనకు దారి చూపే దయాశీలుడు!ఎన్నో కష్టములకు ఓర్చి కొండను చేరి..గోవిందా గోవిందా అంటు మనసు స్వామి వారి పైన ఉంచి..గర్భాలయంలో అడుగుపెట్టగానే మనము వైకుంఠం లో ఉన్న అనుభూతి కలుగుతుంది..

తిరుమల లో అడుగడుగ బ్రహ్మాండమే..

మీ శ్రేయోభిలాషి
గిరీష్
www.manatemples.in

 #మనదేవాలయాలు_మనసంపద  #మనదేవాలయాలు  #మాఘమాసంమాఘ మాసం మహా పాతకములను పోగొట్టే మాసం...మాఘ స్నానానికి ఎంతో విశిష్టత కూడా ఉంద...
11/02/2025

#మనదేవాలయాలు_మనసంపద
#మనదేవాలయాలు
#మాఘమాసం

మాఘ మాసం మహా పాతకములను పోగొట్టే మాసం...మాఘ స్నానానికి ఎంతో విశిష్టత కూడా ఉంది.

మీ శ్రేయోభిలాషి
గిరీష్

నమస్తే భీష్మ ఏకాదశి (08.02.2025)శుభాకాంక్షలుమాఘ మాసము శనివారం ని (08.02.2025) పురస్కరించుకుని  వికారాబాద్ జిల్లా పూడూరు ...
09/02/2025

నమస్తే
భీష్మ ఏకాదశి (08.02.2025)
శుభాకాంక్షలు

మాఘ మాసము శనివారం ని (08.02.2025) పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామం లో కొలువైన ఆంజనేయ స్వామి దేవాలయం లో స్వామి వారికి అభిషేకం,తమలపాకుల పూజ,తులసీదళాల అర్చన కార్యక్రమలు నిర్వహించడం జరిగింది

పూజాది కార్యక్రమాల తరువాత తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

స్వామి వారి కృపా కటాక్షాలు,చల్లని ఆశీస్సులు అందరి పైన చల్లగా ఉండాలని ప్రార్థించడం జరిగింది.

దాతల అందరి గోత్ర నామాలతో స్వామి వారికి అర్చన,అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

దేవాలయం లో జరుగుతున్న అభివృద్ధి పనులకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ

ఇట్లు
గిరి పంతులు

  రంగనాథ స్వామి దేవాలయం, భీమన్ కుప్పే -----------------------------------------------బెంగళూరు కి  సమీపం లో  భీమన్ కుప్పే...
09/02/2025




రంగనాథ స్వామి దేవాలయం, భీమన్ కుప్పే
-----------------------------------------------

బెంగళూరు కి సమీపం లో భీమన్ కుప్పే లో కొలువైన శ్రీ రంగనాథ స్వామి ఆలయం యెంతో పురాతనమైన మరియు ప్రసశ్త్యమైన క్షేత్రం 16 వ శతాబ్దం లో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది .
గర్భాలయం లో కొలువైన శ్రీ రంగనాథ స్వామిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవా అన్న విదంగా దర్శనమిస్తారు . ప్రతి నిత్యం స్వామి వారికి జరిగే పూజా కార్యక్రమాలతో పాటు పండుగలప్పుడు ,ధనుర్మాసం లో విశేషంగా నిర్వహిస్తారు .
బెంగళూర్ కి సమీపం లో కొలువై ఉన్న ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం ఇది .

మీ శ్రేయోభిలాషి
గిరీష్

 #మద్వనవమి  #రాకంచెర్ల #మద్వనవమి సందర్భంగా ఇ రోజు  రేపు మద్వ సంప్రదాయం తో నడిచే దేవాలయాల సమాచారం మీతో పంచుకోవడం జరుగుతుం...
06/02/2025

#మద్వనవమి
#రాకంచెర్ల

#మద్వనవమి సందర్భంగా ఇ రోజు రేపు మద్వ సంప్రదాయం తో నడిచే దేవాలయాల సమాచారం మీతో పంచుకోవడం జరుగుతుంది.

యోగానంద నరసింహ స్వామి దేవాలయం, రాకంచెర్ల

Yogananda Narasimha swamy temple, Rakamcherla,Near Pargi, Vikaarabad dist, Telangana
-----------------------------------------------
ఒక రాయిని కొండ పైన చీమలు యోగానంద నరసింహుని గా మలిచిన క్షేత్రం.యోగానంద నరసింహ స్వామి దేవాలయం.హైదరాబాద్ నుండి పరగి వెళ్ళే మార్గంలో రాకంచెర్ల అనే గ్రామంలో ఈ ప్రసిద్ద పుణ్య క్షేత్రం వెలుగొందుతుంది . ఒక రాయి పైన స్వామి వారు స్వయం భు గ వీరాజిలుతున్న క్షేత్రం.నరసింహ స్వామి యోగ ముద్ర లో వెలుగొందుతున్నాడు.

ఆలయానికి సమీపం లో ఒక చిన్న కొలను ఉంది.అక్కడ భక్తులు స్నానం ఆచారించి నరసింహ క్షేత్రాన్ని సందర్శిస్తారు.ఈ క్షేత్రం లో ఉన్న స్వామి వారి విగ్రహాన్ని చీమలు మలిచాయి అని స్థల పురాణం . మహర్షి వెంకటాదసుల వారు స్వామి వారిని ప్రతి నిత్యం పూజించి వేయి కీర్తనలకు పైగా రాసారు అని దాంట్లో కొన్ని మాత్రమే ప్రస్తుతం పుస్తక రూపం లో ఉన్నాయి . ఆలయ ఆవరణ లో వెంకట దాసుల వారి విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది .

ఆలయ ఆవరణ లో ఆంజనేయ స్వామి దేవాలయం , పాండురంగ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి . చుట్టూ కొండలు , ఆలయ ఆవరణ లో అంతా మామిడి తోటలు ఎంతో రమణీయంగా ,చూడ చక్కగా ఉంటుంది . ప్రతి సంవత్సరం వైశాక పౌర్ణమి రోజు ఇక్కడ స్వామి గారి కల్యాణోత్సవం జరుగుతుంది . అది చూడటానికి చాలామంది బక్తులు వస్తుఉంటారు .

ఈ పుణ్య క్షేత్రానికి దగ్గరలో దామగుండం ( రామలింగేశ్వర స్వామి ) 5 కి మీ లో దూరం లో ఉంటుంది
లోంక ఆంజనేయ స్వామి దేవాలయం 8 కిమీ దూరం లో ఉంటుంది .
అనంత పద్మనభ్ స్వామి దేవాలయం ( అనంత గిరి కొండలు ) 22 కి మీ దురాలో ఉంటుంది.

మీ శ్రేయోభిలాషి
గిరీష్

    #మద్వానవమి #మధ్వాచార్యులు మద్వనవమి శుభాకాంక్షలుమద్వచార్యులు/మద్వనవమిMadwacharyulu -Madwanavami----------------------...
06/02/2025



#మద్వానవమి
#మధ్వాచార్యులు

మద్వనవమి శుభాకాంక్షలు

మద్వచార్యులు/మద్వనవమి
Madwacharyulu -Madwanavami
-----------------------------------------------

మాఘ మాసం లో శుక్ల పక్షం లో వచ్చే నవమిని మద్వనవమి గా జరుపుకుంటారు.

మధ్వాచార్యులు ద్వైత వేదాంతాన్ని బోధించిన మతాచార్యులు. పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో మూడవ వారు. సమకాలీన హిందూధర్మం ఆలోచనా సరళిపై ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది మధ్వాచార్యులు.

క్రీ.శ. 1238–1317 మధ్య కాలంలో మధ్వాచార్యులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. మధ్వాచార్యులు, హనుమంతుడు, భీముడు అనంతరము వాయు దేవునకు తృతీయ అవతారము.

#మద్వాచార్యులు #ఉడిపి వద్ద నున్న పాజక గ్రామంలో క్రీ.శ. 1238 సంవత్సరంలో విజయదశమి రోజున జన్మించారు. మధ్వాచార్యుని జీవిత కథను రచించినది నారాయణ పండితాచార్యులు. అతను తల్లిదండ్రుల పేర్లను మధ్యగేహ భట్ట, వేదవతి లుగా పేర్కొన్నారు. అతనుకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు.

యుక్తవయస్సులో ఉండగానే మధ్వాచార్యుడు దక్షిణ భారతదేశమంతా పర్యటించాలని సంకల్పించాడు. అనంతశయన, కన్యాకుమారి, రామేశ్వరం, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించాడు. ఎక్కడికి వెళ్ళినా తాను తెలుసుకున్న తత్వాన్ని ప్రజలకు ఉపన్యాసాల రూపంలో తెలియజెప్పేవాడు. మూఢనమ్మకాల్ని వ్యతిరేకించాడు. వాటిని ఆధ్యాత్మికతతో ముడిపెట్టకూడదని భావించాడు. అలా అతను ప్రబోధించిన తత్వం దేశవ్యాప్తంగా పండితుల్లో చర్చలు రేకెత్తించగా సనాతన వాదుల నుంచి వ్యతిరేకత కూడా ఎదురైంది. కానీ అయన వేటికీ చలించలేదు. యాత్ర పూర్తి చేసుకుని ఉడుపి చేరుకోగానే భగవద్గీత పై తన భాష్యాన్ని రాయడం ప్రారంభించాడు.

తన #ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు వ్రాసాడు. ఇంకా ఋగ్వేదంలోని మొదటి 40 సూక్తాలకు, భారత భాగవతాలకు వ్యాఖ్యానం వ్రాసాడు. తర్కంతోపాటు మొత్తం 37 గ్రంథాలను రచించాడు.

జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.

#భక్తి ఒక్కటే #ముక్తిదాయకం. అది జ్ఞానపురస్కృతమైన భక్తి అయి ఉండాలి. ముక్తి నాలుగు విధాలు:

#సాలోక్యం - జీవాత్మ భగవంతుని లోకంలో భగవంతునితోపాటు నివసించడం
#సామీప్యం - భగవంతుని సన్నిధానంలో నివసిస్తూ కామితార్థాలను అనుభవించడం
#సారూప్యం - భగవంతుని రూపం పొంది ఇష్టభోగాలు అనుభవిస్తూ ఆనందించడం
#సాయుజ్యం - భక్తుడు భగవంతునిలో లీనమైనా అతను కంటే వేరుగా ఉంటూనే అతను ఆనందంలో పాలుపంచుకోవటం.

#మధ్వాచార్యుడు తన 79వ ఏట, క్రీ.శ.1317లో శిష్య సమేతంగా బదరినారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా ఉత్తర బదరిని చేరుకొని వ్యాసభగవానుని కైంకర్యాలాలో నిమగ్నమైపోయారు.ఆ రోజునే #మద్వనవమి గా జరుపుకుంటారు.

మద్వనవమి రోజు ప్రత్యేకించి మద్వ సాంప్రదాము ప్రకారం సేవా కార్యక్రమాలు నిర్వహించే దేవాలయాలు,మటలు,పిఠాలలో విశేషమైన సేవా కార్యక్రమాలు, భజనలు,ప్రవచనాలు నిర్వహిస్తారు.

హరి సర్వోత్తమ వాయు జీవోత్తమ
కృష్ణం వందే జగద్గురుమ్!!

మీ శ్రేయోభిలాషి
గిరీష్

మౌని అమావాస్య గురించి ఆందరూ వివిధ విషయాలు తెలుపుతున్నారు.సంతోషం.ప్రయాగలో వట మాధవుడు,వేణి మాధవుడు,యోగశాయి ఇలా మాధవుడు కొల...
29/01/2025

మౌని అమావాస్య గురించి ఆందరూ వివిధ విషయాలు తెలుపుతున్నారు.సంతోషం.

ప్రయాగలో వట మాధవుడు,వేణి మాధవుడు,యోగశాయి ఇలా మాధవుడు కొలువుతీరిన ప్రదేశము అని అందరికీ తెలిసినదే.

అయితే ఈ మౌనికి,మాధవునికి ఏమి సంబంధము అనునది మనకు మహాభారతము తెలియజేయుచున్నది.

మౌనాత్ - ధ్యానాచ్చ - యోగాచ్చ - విద్ధిభారత మాధవమ్.

మౌనము వలనను,ధ్యానము వలనను,యోగము వలనను పొందబడువాడు మాధవుడని వ్యాసమహర్షి వాక్యము.

మాధవ శబ్దమునకు ఉన్న అర్థములలో,మా అనగా లక్ష్మి,లక్ష్మికి భర్త కనుక మాధవుడు,మా అనగా ప్రకృతి, ప్రకృతికి అధిపతి అగుటచే మాధవుడు ఇలా ఉండే అనేక అర్థములలోఒక అర్థము మౌనమునకు చిహ్నము (ఆత్మ) నిస్సంగము,నిర్లిప్తము.కావున మాధవుడని పేరు.

కావున మౌని అమావాస్య నాడు చేయవలసినది పై తత్త్వమును తెలుసుకుని మౌనంగా ఉంటూ మాధవుడిలో ఉండి(మౌనము,మననము - ముని) యోగ,జప,తప, దాన,తర్పణాది శాస్త్ర విహిత కర్తవ్య కర్మలు ఆ తీర్థములో ఆచరించటం.

 #పురందరదాసు నేడు భక్త పురందరదాసు...జన్మదినంకర్ణాటక సంగీత పితామహులు శ్రీ భక్త పురందరదాసు గారి జన్మదినం పుష్యమాస బహుళ అమా...
29/01/2025

#పురందరదాసు

నేడు భక్త పురందరదాసు...జన్మదినం

కర్ణాటక సంగీత పితామహులు శ్రీ భక్త పురందరదాసు గారి జన్మదినం పుష్యమాస బహుళ అమావాస్య, ఈ రోజు వారి సంగీత వాగ్గేయకారోత్సవములు దేశమంతటా జరుగును ,భక్త పురందర దాసు
‘’దాసరేంద్రే పురందర దాసరాయ ‘’-దాస భక్తులలో పురందరదాసు శ్రేష్ఠుడు’’అని గురువు వ్యాసతీర్థులవారి ప్రశంస అందుకున్న భక్త శిఖామణి పురందర దాసు సంగీత కర్త, కవి అయిన వాగ్గేయకారుడు.

కర్ణాటక సంగీతానికి ఆద్యుడు అందుకే ‘’కర్ణాటక సంగీత పితామహ ‘’అని పురందరదాసు ను గౌరవంగా సంబోధిస్తారు. నారద మహర్షి అపర అవతారమనీ అంటారు దాసును.
వీరు దాదాపు 4 లక్షల 75 వేల కీర్తనలు రచించారు.

ఆధ్యాత్మిక వేత్తలైన వారికి మాత్రమే బోధపడే శ్రీ మద్ భాగవతాన్ని సుందర సరళతరమైన శ్రావ్యమైన పాటలు గా రాసి సామాన్యులకు కూడా భాగవత పరమార్ధాన్ని తెలియ జేశాడు.

కర్ణాటక సంగీతం లో వ్రేళ్లమీద లెక్కింపదగిన వాగ్గేయకారుడిగా గుర్తింపుపొందాడు .

స్వరావళి ,అలంకారాలతో సంగీతానికి శోభ సమకూర్చాడు .’’మాయా మాళవ’’ రాగాన్ని సృష్టించి సంగీతం నేర్చుకొనే వారికి మొట్టమొదట పాడుకోవటానికి సులభంగా ఉత్సాహ జనకంగా వరప్రసాదంగా అందుబాటులోకి తెచ్చాడు.

ఇప్పటికీ ప్రారంభదశ లో సంగీతం నేర్చుకొనేవారికి వారికి ఈ రాగ0 లోనే సంగీతం బోధించే సంప్రదాయం కొనసాగుతోంది స్వరావాలి ,జంటస్వరాలు ,అలంకారాలు ,లక్షణ గీత ,ప్రబంధాలు యుగభోగాలు ,దాటువరస గీతాలు ,సూలాది మొదలైనవి రాశాడు .ఏదిరాసినా భావ రాగ లయ సమ్మేళనం తో విరిసిన పుష్పంగా కీర్తన శోభిల్లుతోంది .లక్షలాది కీర్తనలు రాసినా లభించి ప్రాచుర్యం లో ఉన్నవి 700 మాత్రమే .

పురందర దాసు భక్తి ఉద్యమంలో దాస సాహిత్యాన్ని పరిపోషించి వ్యాప్తి చెందించాడు.కన్నడం లో చాలా కీర్తనలు రాసినా, సంస్కృతం లోనూ పురందరదాసు కృతులు రాసి కీర్తి గడించాడు. ఆయన కృతులలో ‘’పురందర విఠల ‘’అనేది అంకిత ముద్ర గా ఉండటం విశేషం

పుష్య బహుళ అమావాస్య నాడు పురందరదాసు ఆరాధనోత్సవం ఘనం గా నిర్వహిస్తున్నారు .

కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాసు అందరికి ఆరాధనీయుడే.

మీ శ్రేయోభిలాషి
గిరీష్

29/01/2025

భగవత్ బంధువులందరికీ
మౌని అమావాస్య/చొల్లంగి అమావాస్య
శుభాకాంక్షలు

Address

Hyderabad
500081

Alerts

Be the first to know and let us send you an email when మన దేవాలయాలు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to మన దేవాలయాలు:

Share

Category