22/02/2026
బ్రాండ్ వైజాగ్ పై కుట్ర 1
ఇటీవల విశాఖ పట్నం బ్రాండ్ సప్త సమూద్రాలు దాటి ప్రపంచ వ్యాప్తం అయింది. గూగుల్ సంస్థ అత్యంత భారీ పెట్టు బడితో రావడం మన వైజాగ్ గర్వ కారణం. ఏఐ సమిత్ లో కూడా గూగుల్ ఆల్ఫాబెట్ (గూగుల్ మదర్ కంపెనీ) చేసిన ప్రకటన తో మరోసారి మన బ్రాండ్ ఏంటో దేశ విదేశాల్లో ఉన్న ప్రతినిధులకు అర్థం అయింది. అలాంటి బ్రాండ్ మన దేశానికి , మన స్వ రాష్ట్రానికి రావడం ఎందుకో ఇక్కడున్న కుహానా మేధావుల అనడబడే మావోయిస్ట్ మద్దతు దారులకు అయిష్టంగా , నచ్చక మన వైజాగ్ బ్రాండ్ పై దాడికి దిగుతున్నారు.
ఇది ముమ్మాటికీ మావోయిస్టులకు మద్దతిచ్చే విద్యార్థి విభాగం పనే అనుమానాలు రాక మానదు. ఎందుకంటే అదును చూసి , సరైన సమయం చూసి వారి ఉనికి చాటుకుంటారు మావోయిస్టులు. ఇటీవల కాలంలో కేంద్ర హోం శాఖ ఏరి పారేయడంతో మావోల కదలికలు జనారణ్యంలోకి చొరబడ్డారా అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఒకవైపు లొంగుబాట్ల పరంపర కొనసాగుతుండగా, వారి ఆయువు పట్టుగా ఉన్న ఉత్తరాంధ్ర లోని గ్రామాల్లోకి సాధారణ ప్రజల్లాగ కలసి పోతున్నారు. అయితే వారి కదలికలపై ఇంటలిజెన్స్ సమాచారం ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతునే ఉంది.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మవోయిస్టులు , వారి అనుకూల జర్నలిస్టులు , వారి మద్దతుగా ఉన్న అర్భన్ నక్సల్స్ అంతా ఒకే సారి ఆంధ్రా యూనివర్సిలోని ఓ చిన్న ఘర్షణని ఆజ్యం పోశారు. అసలు దీని వెనక జరిగిన కుట్రకోణం బయట పెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. సామాన్యులకు భయబ్రాంతులు కలిగించే విషయం అయితే పోలీసులు సైతం బయటపెట్టరు. దాన్ని మొగ్గలోనే తుంచే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడదే జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో భారీగా లొంగిపోయిన నక్సలైట్లు స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్నిముందుకు తీసుకు పోదామని చూశారు. కానీ వారి ఆటలు సాగలేదు. పోలీసుల కంట పడకుండా అక్కడి నుంచి పారిపోయారు. ఇప్పుడు కొత్తగా ఆంధ్ర యూనివర్సిటీలో ఏదో జరిగిపోతుందని, దానికి మతం రంగు పులిమి, విషయాన్ని పెద్దది చేయాలని చూస్తున్నారు. ఆంద్రా యూనివర్సిటీ నే ఎందుకు ఎంచుకున్నారంటే, గూగుల్ లాంటి సంస్థ రావడం ఇటీవల ఏఐ సమితిలో విశాఖ ప్రస్తావన రావడంతో మావోయిస్ట్ సానుబూతి పరులు మీడియాకు లీకులిచ్చి, తమ శిష్యగణంతో పుంకాను పుంకల స్టోరీలు రాయించి, ఏయూలో ఏదో జరిగిపోతుందని బయట జనం చర్చించుకునేలా చేయడం వారి పన్నాగం కావొచ్చు.
కానీ సహనశీలి అనే పదానికి మన విశాఖ ప్రజానీకం పర్యయపదం అనిచెప్పాలి. కమ్యూనిస్టు మద్దతు విద్యార్థి సంఘాలకు ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం పోలీసులకు సమాచారం అందితే వారి గతి ఏమిటని ఒకసారి సదరు విద్యార్థి సంఘాలు ఆలో చించాలి.
ఇక చివరగా, ఏయూలో మొత్తం గొడవలకు కారణంగా చెప్పుకొస్తున్న సంఘ్ కార్యక్రమం ఇవాళ మొదలైంది కాదు, అలాగే ముగిసిపోయేది కాదు. కర్రసాము, కవాతు ప్రతి నిత్యం ఏయూ గ్రౌండ్ లో జరిగేదే. ఇదేం కొత్త విషయం కాదు. పొద్దున్న ఏయూ గ్రౌండ్ లో ఒక పక్క క్రికెట్ ఆడుకునే పిల్లలు, మరో పక్క వాకింగ్ చేసుకునే పెద్దలు అందరిదీ తలో దారి. అందులో ఆర్ ఎస్ ఎస్ కూడా తన పనేదో తనుచేసుకుంటుంది. దాన్ని బూతద్దంలో చూడమని, వారిపై దాడి చేయమని విద్యార్థి సంఘాలకు ఉసి గలిపిన ఆ మావోయిస్టు సానుబూతి పరులెవరో కానీ, సగం పని పూర్తి అయింది. అయితే జనం ఈ విషయంపై వారిపై మిశ్రమ స్పందన రావడంతో సైలెంట్ అయ్యారని సమాచారం. ఇక పోతే ఇవాళ వరంగంల్ నిట్ లో హనుమాన్ చాలీసా చదవకూడదని చీఫ్ వార్డెన అజీజ్ అదేశం ఇచ్చారట. ఇప్పుడు అర్థం అయిందా ఏయూ నుంచి సీన్ వరంగల్ నిట్ కి మారింది.
BJYM Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP)